Chateshwar Pujara : చ‌తేశ్వ‌ర్ పుజారా ఇండియా టీమ్ ఇదే

ఆసియా క‌ప్ 2022లో కార్తీక్ కు నో చాన్స్

Chateshwar Pujara : మెగా టోర్నీ ఆసియా క‌ప్ -2022లో అత్యంత కీల‌క‌మైన దాయాదుల మ‌ధ్య పోరు కొన‌సాగుతోంది. ఇరు దేశాల మ‌ధ్య నెల‌కొన్న రాజ‌కీయ ఉద్రిక్త‌త‌ల మ‌ధ్య మ్యాచ్ లు కొన‌సాగడం లేదు. త‌ట‌స్థ వేదిక‌ల మీద‌నే మ్యాచ్ లు కొన‌సాగుతున్నాయి.

గ‌త ఏడాది 2021లో యూఏఈ వేదిక‌గా టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ జ‌రిగింది. కీల‌క పోరులో పాకిస్తాన్ జ‌ట్టు చేతిలో ఏకంగా 10 వికెట్ల తేడాతో ఘోరంగా ఓట‌మి పాలైంది భార‌త జ‌ట్టు.

ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ కీల‌క‌మైన మ్యాచ్ కోసం ఎంతో ఉత్కంఠ‌తో ఎదురు చూస్తోంది. నిన్న మాజీ క్రికెట‌ర్ వ‌సీం జాఫ‌ర్ త‌న జ‌ట్టును ప్ర‌క‌టించాడు.

తాజాగా ఆదివారం భార‌త వెట‌ర‌న్ క్రికెట‌ర్ చ‌తేశ్వ‌ర్ పుజారా(Chateshwar Pujara) త‌న అంచ‌నాతో కూడిన జ‌ట్టును ప్ర‌క‌టించాడు. ఓపెన‌ర్లుగా రోహిత్ , రాహుల్ ను ఎంపిక చేశాడు.

ఆల్ రౌండ‌ర్ల కోటాలో పాండ్యా, జ‌డేజాను ఎంపిక చేశాడు. ఇక ఫాస్ట్ బౌల‌ర్ల కోటాలో భువ‌నేశ్వ‌ర్ కుమార్ , అవేష్ ఖాన్ , అర్ష్ దీప్ సింగ్ కు చాన్స్ ఇచ్చాడు చ‌తేశ్వ‌ర్ పుజారా. విచిత్రం ఏమిటే ఫినిష‌ర్ గా పేరొందిన దినేష్ కార్తీక్ ను ఎంపిక చేయ‌క పోవ‌డం గ‌మ‌నార్హం.

ఇదిలా ఉండ‌గా పుజారా ఎంచుకున్న టీమ్ ఇండియా ఫ్లేయింగ్ ఎలెవ‌న్ ను ఎంపిక చేశాడు. ఇక చ‌తేశ్వ‌ర్ ఎంచుకున్న జ‌ట్టు ఇదే. రోహిత్ శ‌ర్మ కెప్టెన్. కేఎల్ రాహుల్. విరాట్ కోహ్లీ, సూర్య కుమార్ యాద‌వ్, రిష‌బ్ పంత్ , హార్దిక్ పాండ్యా, ర‌వీంద్ర జ‌డేజా, భువనేశ్వ‌ర్ కుమార్ , అవేశ్ ఖాన్ , అర్ష్ దీప్ , చాహ‌ల్.

Also Read : యూఏఈలో ‘సంజూ బాబా’కు య‌మ క్రేజ్

Leave A Reply

Your Email Id will not be published!