Johnny Depp : జానీ డెప్ హ‌ర్డ్ కేసు తీర్పుపై ఉత్కంఠ

తుది తీర్పు కోసం యావ‌త్ ప్ర‌పంచం

Johnny Depp : సినీ ప్ర‌పంచంలో కోట్లాది మంది అభిమానుల‌ను సంపాదించుకున్న అరుదైన న‌టుడు జానీ డెప్(Johnny Depp) , అంబ‌ర్ హ‌ర్డ్ ప‌రువు న‌ష్టం కేసు పై తుది తీర్పు వెలువ‌డ‌నుంది. ఏం తీర్పు వ‌స్తుందోన‌న్న ఆందోళ‌న‌, ఉత్కంఠ స‌ర్వ‌త్రా నెల‌కొంది.

ఇందుకు సంబంధించి జ్యూరీ మ‌ళ్లీ స‌మావేశం కానుంది. డిసెంబ‌ర్ 2018లో ది వాషింగ్ట‌న్ పోస్ట్ కోసం ఆమె రాసిన ఆప్ ఎడ్ పై హెర్డ్ పై డెప్ దావా వేయ‌డం, త‌న‌ను తాను గృహ దుర్వినియోగానికి ప్రాతినిధ్యం వ‌హించే ప‌బ్లిక్ ఫిగ‌ర్ గా అభివ‌ర్ణించింది.

ఇక ఈ కేసుకు సంబంధించి జ్యూరీ ఫెయిర్ ఫాక్స్ కౌంటీ స‌ర్క్యూట్ కోర్టులో బుధ‌వారం చ‌ర్చ‌ల‌ను పునః ప్రారంభించింది.

పైరేట్స్ ఆఫ్ ది క‌రేబియ‌న్ స్టార్ జానీ డెప్ , అత‌ని మాజీ భార్య అంబ‌ర్ హ‌ర్డ్ మ‌ధ్య జ‌రిగిన ప‌రువు న‌ష్టం కేసుపై జ్యూరీ మంగ‌ళ‌వారం ఎటువంటి తీర్పు చెప్ప‌కుండానే చ‌ర్చ‌ల‌ను ముగించింది.

ఏడుగురు వ్య‌క్తుల తో కూడిన జ్యూరీ ఇవాళ ఉద‌యం అమెరికా రాజ‌ధానికి స‌మీపంలోని ఫెయిర్ ఫాక్స్ కౌంటీ స‌ర్క్యూట్ కోర్టులో త‌మ చ‌ర్చ‌ల‌ను పునః ప్రారంభించింది. ఇదిలా ఉండ‌గా జ్యూరీ మంగ‌ళ‌వారం 7 గంట‌లు, శుక్ర‌వారం 2 గంట‌ల పాటు స‌మావేశ‌మైంది.

గృహ హింస‌కు సంబంధించిన క్లెయిమ్ లు, కౌంట‌ర్ క్లెయిమ్ ల‌ను క‌లిగి ఉన్న ఆరు వారాల విచార‌ణ సంద‌ర్భంగా ఇరువురి త‌ర‌పు వాద‌నలు ముగిశాయి. అంతిమ తీర్పు ఇవాళ వెలువ‌డ‌నుంది.

దీనిపైనే స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది. ఏం జ‌రుగుతుందోనని జానీ డెప్ అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఆయ‌న‌కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ‌గా ఉంది.

Also Read : గాయ‌క దిగ్గ‌జం మూగ బోయిన స్వ‌రం

Leave A Reply

Your Email Id will not be published!