Tirumala : టీటీడీ కీలక అప్డేట్..స్థానికుల కోటాలో కీలక మార్పులు

ఈ క్రమంలో స్థానిక కోటా దర్శనాలు మార్చడమైనది...

Tirumala : తిరుమల, తిరుపతి భక్తులకు దర్శనాన్ని సులభతరం చేసేందుకు ఎప్పటికప్పుడూ టీటీడీ(TTD) (తిరుమల తిరుపతి దేవస్థానం) కీలక నిర్ణయాలు తీసుకుంటోంది.ఈ క్రమంలో ప్రతినెలా అందిస్తోన్న స్థానిక కోటా కూడా ఎంతో కీలకమని చెప్పవచ్చు. ఈ కోటా ద్వారా ప్రతి నెలలో మొదటి మంగళవారం భక్తులు తిరుమల, తిరుపతిలోని ప్రముఖ దేవాలయాలను సందర్శించవచ్చు. అయితే ఈనెలలో కొన్ని మార్పులు తీసుకొచ్చినట్టు టీటీడీ ప్రకటించింది. ఈనెల మొదటి మంగళవారమైన 4వ తేదీన రథసప్తమి పర్వదినం ఉంటుంది. ఈ సందర్భంగా భక్తుల రద్దీ అధికంగా ఉంటుందని, అందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

Tirumala Updates

ఈ క్రమంలో స్థానిక కోటా దర్శనాలు మార్చడమైనది. గతంలో జరగాల్సిన 4వ తేదీన జరిగే దర్శనాలను 11వ తేదీ, రెండో మంగళవారానికి పొడిగించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, టీటీడీ ఈ మార్పులను చేయడం జరిగింది. తాజా మార్పుల ప్రకారం తిరుమలలోని బాలాజీ నగర్ కమ్యూనిటీ హాల్, తిరుపతిలోని మహతీ ఆడిటోరియం ద్వారా 9వ తేదీ ఆదివారం టోకెన్లను జారీ చేయనున్నారు. ఈ టోకెన్లను భక్తులు 9వ తేదీన తీసుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. భక్తులు ఈ మార్పు గురించి ముందుగానే తెలియజేసినట్లుగా టోకెన్లు పొందేందుకు మరిన్ని ఏర్పాట్లు చేయవలసినదిగా టీటీడీ సూచిస్తోంది.

భక్తులు తమ స్థానిక కోటా దర్శనం కోసం తిరుమల లేదా తిరుపతిలోని ప్రత్యేకమైన కేంద్రాల్లో 9వ తేదీ ఆదివారం టోకెన్లను పొందవచ్చు. జారీ చేయబడ్డ టోకెన్లు మాత్రమే తగిన సదుపాయాలను కలిగి ఉంటాయి. భక్తులు ఈ మార్పులపై అవసరమైన జాగ్రత్తలు తీసుకుని, తమ దర్శనాలను సకాలంలో పూర్తి చేయడానికి ముందుగా ప్రణాళికలు రూపొందించుకోవాలి. ఈ విధంగా టీటీడీ తిరుమల, తిరుపతి భక్తులకు సౌకర్యవంతమైన దర్శనాలు కల్పించేందుకు ఎప్పటికప్పుడు చర్యలను తీసుకుంటోంది.

Also Read : Minister Ponnam : ట్రాఫిక్ , రవాణా నిబంధనలు పాటించకపోతే చర్యలు తప్పవు

Leave A Reply

Your Email Id will not be published!