TTD: శ్రీవారిమెట్టు వద్ద దివ్యదర్శనం టోకెన్ల జారీ కౌంటర్లు తాత్కాలికంగా మార్పు

శ్రీవారిమెట్టు వద్ద దివ్యదర్శనం టోకెన్ల జారీ కౌంటర్లు తాత్కాలికంగా మార్పు

TTD : శ్రీవారిమెట్టు వద్ద ఇచ్చే దివ్యదర్శనం టోకెన్ల జారీ కౌంటర్లను తాత్కాలికంగా అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్ కు మార్చాలని టీటీడీ(TTD) నిర్ణయించింది. ఈమేరకు నూతన కౌంటర్లు శుక్రవారం సాయంత్రం నుంచి భూదేవి కాంప్లెక్స్‌లో అందుబాటులోకి రానున్నాయి. ఈనెల 6వ తేదీ సాయంత్రం నుంచి టోకెన్ల జారీ ప్రక్రియ… టోకెన్ల లభ్యత మేరకు ముందు వచ్చిన వారికి ముందు ప్రాతిపదికన ప్రారంభం కానుంది. ఆధార్‌కార్డు చూపించి దివ్యదర్శనం టోకెన్లు పొందిన భక్తుల శ్రీవారి మెట్టులోని 1200వ మెట్టు వద్ద స్కాన్‌ చేసుకోవాల్సి ఉంటుంది. శనివారం శ్రీవారి దర్శనం కోసం శుక్రవారం సాయంత్రమే దివ్యదర్శనం టోకెన్లు మంజూరు చేస్తారు. ఇదే సమయంలో ఎస్‌ఎస్‌డీ (సర్వదర్శనం) టోకెన్లు కూడా అలిపిరి భూదేవి కాంప్లెక్స్‌లో నిర్దేశించిన కౌంటర్లలో అందిస్తారు. భక్తుల రద్దీ నేపథ్యంలో భద్రత, ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తకుండా తితిదే విజిలెన్స్‌, సెక్యూరిటీ, జిల్లా పోలీసులు సమన్వయంతో ముందు జాగ్రత్తలు తీసుకోవాలని ఈవో ఆదేశించారు.

TTD – టీటీడీకి భారీ విరాళం అందించిన కర్ణాటక భక్తురాలు

తిరుమల తిరుపతి దేవస్థానానికి కర్ణాటకకు చెందిన భక్తురాలు భారీ విరాళం అందించింది. మంగళూరు ప్రాంతానికి చెందిన విద్యా రవిచంద్రన్ అనే భక్తురాలు.. టీటీడీ(TTD) ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు 54 లక్షల రూపాయలు విరాళంగా అందించారు. విరాళానికి సంబంధించిన డీడీని టీటీడీ ఏఈవో వెంకయ్య చౌదరికి మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా దాతను వెంకయ్య చౌదరి అభినందించారు.

మరోవైపు తిరుమల తిరుపతి దేవస్థానం ఎన్నో సేవా కార్యక్రమాలను చేపడుతోంది. అందులో ఎస్వీ ప్రాణదాన ట్రస్టు ఒకటి. ఎస్వీ ప్రాణదాన ట్రస్టు ద్వారా గుండె, మూత్రపిండాలు, మెదడు, క్యాన్సర్, ఇతర ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్న రోగులకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తారు. శ్రీవారి భక్తులు అందించే విరాళాల ద్వారా ఎస్వీ ప్రాణదాన ట్రస్టును నిర్వహిస్తున్నారు. ఎస్వీ ప్రాణదాన ట్రస్ట్ ద్వారా ప్రాణాంతక వ్యాధులతో బాధపడే వారికి ఉచిత వైద్యం, చికిత్సకు అవసరమైన మందులు, ఇతర వైద్య సదుపాయాలను అందిస్తారు. ఎస్వీ ప్రాణదాన ట్రస్ట్‌కు విరాళాలు అందించడం ద్వారా పేద రోగులకు ఉచిత వైద్య సేవలను అందించడానికి సహాయపడవచ్చు. ఈ నేపథ్యంలో తిరుమలకు వచ్చే ప్రముఖులు, భక్తులు.. ఈ ట్రస్టుకు విరాళాలు అందిస్తూ.. మానవసేవే మాధవసేవగా భావిస్తూ తమ వంతు సహకారం అందిస్తున్నారు. ఈ క్రమంలోనే కర్ణాటక భక్తురాలు విద్యా రవిచంద్రన్ టీటీడీ ప్రాణదానం ట్రస్టుకు భారీ విరాళం అందించారు.

Also Read : YS Jagan: వెన్నుపోటు దినంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి – వైఎస్‌ జగన్‌

Leave A Reply

Your Email Id will not be published!