Vallabhaneni Vamsi : నకిలీ ఇళ్ల పట్టాల కేసులో మాజీ ఎమ్మెల్యే వంశీకి ఊరట
రెండు రోజుల క్రితం ఈ పిటిషన్పై న్యాయస్థానంలో విచారణ జరిగింది...
Vallabhaneni Vamsi : వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఊరట లభించింది. వంశీని రెండో సారి పోలీస్ కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు పిటిషన్ దాఖలు చేయగా.. ఆ పిటిషన్ను డిస్మిస్ చేసింది నూజివీడు కోర్టు. నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ కేసులో వంశీని(Vallabhaneni Vamsi) రెండోసారి కస్టడీకి ఇవ్వాలంటూ హనుమాన్ జంక్షన్ పోలీసులు కోర్టును కోరారు. మూడు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని పిటిషన్లో పేర్కొన్నారు. రెండు రోజుల క్రితం ఈ పిటిషన్పై న్యాయస్థానంలో విచారణ జరిగింది. గతంలో ఇదే కేసులో రెండు రోజుల పాటు వంశీని పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారించారని వంశీ తరపు న్యాయవాది వాదించారు.
Vallabhaneni Vamsi Case Updates
అయితే కస్టడీకి తీసుకున్న సమయంలో వంశీ(Vallabhaneni Vamsi) అస్వస్థతకు గురయ్యారని, దీంతో విచారణ సరిగా జరగలేదని పోలీసులు కోర్టుకు తెలిపారు. ఇరువురి వాదనలు విన్న న్యాయస్థానం రెండు రోజుల్లో ఏం విచారణ చేశారో చెప్పాలని పోలీసులను ఆదేశిస్తూ నేటికి విచారణను వాయిదా వేసింది. ఈరోజు మరోసారి విచారణకు రాగా.. గతంలో ఒకసారి ఇదే కేసులో రెండు రోజుల పాటు కస్టడీకి ఇవ్వటంతో తాజా పిటిషన్ను డిస్మిస్ చేస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.
ఇక నకిలీ ఇళ్ల పట్టాల కేసులో వంశీకి మరోసారి రిమాండ్ పొడిగించింది కోర్టు. నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ కేసులో నేటితో (గురువారం) వంశీకి రిమాండ్ ముగిసింది. దీంతో వంశీని వర్చువల్గా న్యాయమూర్తి ఎదుట పోలీసులు హాజరుపర్చారు. ఈ క్రమంలో వంశీకి జూన్ 12 వరకు రిమాండ్ పొడిగిస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు.
మరోవైపు ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యం చేయించడానికి అనుమతి ఇవ్వాలని నూజివీడు కోర్టులో వల్లభనేని వంశీ పిటిషన్ దాఖలు చేశారు. అనారోగ్యంతో బాధ పడుతున్న కారణంగా ప్రైవేట్ ఆసుపత్రికి తరలించాలని పిటిషన్లో కోరారు. దీనిపై ఈరోజు విచారణ జరిపిన కోర్టు.. కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను వచ్చే నెల 2కు వాయిదా వేసింది.
ఇక.. అక్రమ మైనింగ్ కేసులో వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వంశీ ముఖ్య అనుచరుడు ఓలుపల్లి మోహన్ రంగాను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. రంగాను రెండు రోజుల పాటు పోలీస్ కస్టడీకి ఇస్తూ కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ క్రమంలో ఈరోజు విజయవాడ జిల్లా జైలుకు చేరుకున్న పోలీసులు.. రంగాను జిల్లా జైలు నుంచి గన్నవరం ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షల అనంతరం రంగాను పోలీస్స్టేషన్కు తరలించారు. నేడు, రేపు రెండు రోజుల పాటు రంగాను పోలీసులు కస్టడీకి తీసుకుని ప్రశ్నించనున్నారు.
Also Read : Minister Rajnath Singh : పిఓకేను స్వాదీనం చేసుకునే సమయం దగ్గరలోనే ఉంది