Air India Plane Crash: విమాన ప్రమాదంలో గుజరాత్‌ మాజీ సీఎం విజయ్‌ రూపానీ మృతి

విమాన ప్రమాదంలో గుజరాత్‌ మాజీ సీఎం విజయ్‌ రూపానీ మృతి

Air India Plane Crash : ఎయిరిండియా విమాన ప్రమాదంలో గుజరాత్‌ మాజీ సీఎం, బీజేపీ సీనియర్‌ నేత విజయ్‌ రూపానీ మృతి చెందారు. ఈ విషయాన్ని కేంద్రమంత్రి, గుజరాత్‌ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సీఆర్‌ పాటిల్‌ ధ్రువీకరించారు. లండన్‌ లో ఉంటున్న తన కుమార్తెను చూసేందుకు విజయ్‌ రూపానీ ప్రయాణానికి బుక్‌ చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే ఆయన పేరుతో ఒక టికెట్‌ తొలుత నెట్టింట వైరల్‌గా మారింది. ఆపై ఆయన విమానం ఎక్కినట్లు నిర్ధరించే ప్యాసింజర్‌ జాబితాలోనూ రూపానీ పేరు ఉండడంతో ఆయన సమాచారం గురించి పలువురు ఆరా తీశారు. ఈ నేపథ్యంలో ఆయన మృతిని పార్టీ ధ్రువీకరించింది.

Air India Plane Crash – Gujarat BJP Senior Leader Death

బీజేపీకు చెందిన విజయ్‌ రామ్‌నిక్‌లాల్‌భాయ్‌ రూపానీ 2016 నుంచి 2021 వరకు రెండు సార్లు గుజరాత్‌ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆయనకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె కాగా… చిన్న కుమారుడు పూజిత్‌ ఓ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.

Also Read : Top Aircraft Accidents: భారత్‌ లో జరిగిన భారీ విమాన ప్రమాదాల గురించి తెలుసా

Leave A Reply

Your Email Id will not be published!