Virat Kohli Wasim Akram : క్రికెట్ దిగ్గ‌జాల హ‌ల్ చ‌ల్

విరాట్ కోహ్లీ వ‌సీం అక్ర‌మ్ వైర‌ల్

Virat Kohli Wasim Akram :  యూఏఈ వేదిక‌గా జ‌రుగుతున్న ఆసియా క‌ప్ 2022లో అరుదైన స‌న్నివేశాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రపంచ క్రికెట్ లో క్రికెట్ దిగ్గ‌జాలు కొలువు తీరారు.

ఇక దాయాదులైన భార‌త్, పాకిస్తాన్ జ‌ట్ల మ‌ధ్య జ‌రిగే కంటే ముందు అద్భుతం చోటు చేసుకుంది. ఇరు దేశాల మ‌ధ్య విభేదాలు, రాజ‌కీయ వైరుధ్యాలు ఉన్నా ఆట‌గాళ్ల మ‌ధ్య వైరం ఉండ‌దు స్నేహానికి ప్ర‌యారిటీ ఉంటుంద‌ని చెప్ప‌క‌నే చెప్పారు.

భార‌త్, పాకిస్తాన్ జ‌ట్ల మ‌ధ్య జ‌రిగిన ఆస‌క్తిక‌ర మ్యాచ్ లో భార‌త్ పాకిస్తాన్ ను 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్ ను ప్ర‌పంచ వ్యాప్తంగా కోట్లాది మంది వీక్షించారు.

ఇదే స‌మ‌యంలో మ్యాచ్ ప్రారంభం కంటే ముందు పాకిస్తాన్ మాజీ స్టార్ ప్లేయ‌ర్, కామెంటేట‌ర్ వ‌సీం ఆక్ర‌మ్ ను భార‌త స్టార్ ప్లేయ‌ర్ విరాట్ కోహ్లీ(Virat Kohli Wasim Akram) ఆలింగ‌నం చేసుకున్నారు.

వీరిద్ద‌రూ గ‌తం లో నుంచే మంచి స్నేహితులు. వీరిద్ద‌రి క‌ల‌యిక‌తో అక్క‌డున్న వంద‌లాది కెమెరాల‌తో పాటు ల‌క్ష‌లాది మొబైల్స్ సెల్ఫీల‌తో క్లిక్కు మ‌నిపించాయి.

ప్ర‌స్తుతం వ‌సీం అక్ర‌మ్ తో జ‌రిగిన అన‌ధికారిక స‌మావేశానికి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. ఇద్ద‌రూ ఆలింగ‌నం అనంత‌రం క‌లిసి సంతోషంగా ప‌ల‌క‌రించు కోవ‌డం చ‌ర్చ‌కు దారితీసింది.

విరాట్ కోహ్లీ, వ‌సీం అక్ర‌మ్ ల క‌ల‌యిక యావ‌త్ ప్ర‌పంచాన్ని విస్తు పోయేలా చేసింది. ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) , బీసీసీఐ, పీసీబీ , త‌దిత‌ర దేశాల క్రికెట్ బోర్డులతో పాటు కోట్లాది మంది క్రికెట్ అభిమానులు ప్ర‌శంస‌లు కురుస్తున్నాయి.

Also Read : ఆట కంటే నాకు దేశం ముఖ్యం – పాండ్యా

Leave A Reply

Your Email Id will not be published!