Virender Sehwag : ఆ ఇద్ద‌రి కంటే జైశ్వాల్ బెట‌ర్

వీరేంద్ర సెహ్వాగ్ సంచ‌ల‌న కామెంట్స్

Virender Sehwag : వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేయ‌డంలో భార‌త మాజీ క్రికెట‌ర్ల‌లో అంద‌రికంటే ముందుంటాడు వీరేంద్ర సెహ్వాగ్. త‌రుచూ ఐపీఎల్ లో చోటు చేసుకున్న ప‌రిణామాలు, మ్యాచ్ ల‌పై త‌న అభిప్రాయాల‌ను వ్య‌క్తం చేస్తూ వ‌స్తున్నారు.

మొన్న‌టికి మొన్న కోహ్లీ, గంగూలీల‌లో ఎవ‌రు బెస్ట్ కెప్టెన్ అన్న ప్ర‌శ్న‌కు కుండ బ‌ద్ద‌లు కొట్టాడు వీరూ. గంగూలీనే త‌న ప్ర‌యారిటీ అని చెప్పాడు. ఎందుకంటే కోహ్లీ తాను మాత్ర‌మే ఎదిగాడు.

కానీ దాదా తాను ఎదుగుతూ మిగ‌తా వాళ్ల‌ను తీసుకు వ‌చ్చాడు. వారిని ప్రోత్స‌హించాడంటూ కితాబు ఇచ్చాడు. ఆయ‌న చేసిన కామెంట్స్ క‌ల‌క‌లం రేపాయి. తాజాగా మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేసి వార్త‌ల్లో నిలిచాడు సెహ్వాగ్(Virender Sehwag).

ఐపీఎల్ 2022లో భాగంగా కీల‌క‌మైన లీగ్ మ్యాచ్ చెన్నై సూప‌ర్ కింగ్స్ , రాజ‌స్తాన్ రాయ‌ల్స్ మ‌ధ్య జ‌రిగింది. మొద‌ట బ్యాటింగ్ చేసిన సీఎస్కే 150 ర‌న్స్ చేసింది. అనంత‌రం బ‌రిలోకి దిగిన రాజ‌స్తాన్ 151 ప‌రుగులు చేసి విజ‌యం సాధించింది.

అయితే బ‌ట్ల‌ర్, సంజూ శాంస‌న్ త్వ‌ర‌గా ఔట్ అయ్యారు. ఆ త‌రుణంలో అద్భుత‌మైన బ్యాటింగ్ తో ఆక‌ట్టుకున్నాడు యువ బ్యాట‌ర్, ఒక‌ప్పుడు రోడ్డుపై త‌న తండ్రితో క‌లిసి పానీ పూరీ అమ్మిన య‌శ‌స్వి జైస్వాల్.

కీల‌క ఇన్నింగ్స్ ఆడి విజ‌యంలో భాగ‌స్వామిగా ఉన్నాడు. జైస్వాల్, ర‌విచంద్ర‌న్ అశ్విన్ ఆట తీరుపై స్పందించాడు వీరూ.
త‌న‌కు బ‌ట్ల‌ర్, శాంస‌న్ కంటే జైస్వాల్ మ‌రింత బెటర్ గా క‌నిపించారంటూ కామెంట్ చేశాడు.

కాగా జైస్వాల్ అశ్విన్ తో క‌లిసి మ్యాచ్ చివ‌రి వ‌ర‌కు ఆడి ఉంటే బాగుండేద‌న్నాడు.

Also Read : ఆ జ‌ట్టు స‌క్సెస్ వెనుక‌ ఆ ఇద్ద‌రు

Leave A Reply

Your Email Id will not be published!