Wasim Jaffer : భార‌త్ దెబ్బ ఆసిస్ అబ్బా – వ‌సీం జాఫ‌ర్

మాజీ క్రికెట‌ర్ చేసిన ట్వీట్ వైర‌ల్

Wasim Jaffer : భార‌త మాజీ క్రికెట‌ర్ వ‌సీం జాఫ‌ర్(Wasim Jaffer)  భార‌త జ‌ట్టు సాధించిన అద్భుత విజ‌యం గురించి చేసిన ట్వీట్ వైర‌ల్ గా మారింది. సోష‌ల్ మీడియాను షేక్ చేస్తోంది.

గ‌బ్బా గ‌బ్బా క‌ర్నే వాలో కో యాద్ దిలా దియే ది అబ్బా అంటూ ఆనాటి విజ‌యాన్ని గుర్తు చేశారు. 2021 ప్రారంభంలో ఆస్ట్రేలియాలో భార‌త్ ఆడింది.

ఆసిస్ కు బ‌లంగా భావించే స్వంత ప్రాంత‌మైన బ్రిస్బేన్ లో బ్యాగీ గ్రీన్స్ ను ఓడించి అద్భుత విజ‌యాన్ని న‌మోదు చేసింది. సీరీస్ చేజిక్కించుకుంది. సీరీస్ లో భాగంగా నాల్గ‌వ‌ది,

చివ‌రిది అయిన టెస్టులో 3 వికెట్ల తేడాతో గెలుపొంది చ‌రిత్ర సృష్టించింది. ఈ సంద‌ర్భంగా మ‌రోసారి ఆ విక్ట‌రీని గుర్తు చేశారు వ‌సీం జాఫ‌ర్(Wasim Jaffer) . ఈ విజ‌యం భార‌త్ కు ప్ర‌త్యేకం.

ఆతిథ్య జ‌ట్టు సీరీస్ లో ఆధిక్యంలోకి రావ‌డంతో అడిలైడ్ రెండో ఇన్నింగ్స్ లో కేవ‌లం 36 ప‌రుగుల‌కే ఆలౌటై భార‌త్ అవ‌మానం ఎదుర్కొంది.

అప్ప‌టికే కెప్టెన్ విరాట్ కోహ్లీ తిరిగి స్వ‌దేశానికి రావ‌డంతో ఇక టీమిండియా గెల‌వ‌ద‌ని అంతా డిసైడ్ అయ్యారు. మెల్ బోర్న్ లో జ‌రిగిన 2వ టెస్టులో స్టాండ్ ఇన్ కెప్టెన్ అజింక్యా ర‌హానే జీవిత కాల ఇన్నింగ్స్ ఆడాడు.

గొప్ప పునరాగ‌మ‌న విజ‌యానికి బాట‌లు వేశాడు. ఇక సిడ్నీలో జ‌రిగిన మూడో టెస్ట్ ఆసిస్ చేజిక్కించు కుంటుంద‌ని అనుకున్నారు. కానీ పుజారా, పంత్ , అశ్విన్ , విహారి వంటి ఆట‌గాళ్ల ప‌ట్టుద‌ల‌, సంక‌ల్పం ముందు చిన్న బోయింది.

టెస్టు డ్రాగా ముగిసింది. బ్రిస్బేన్ లో జ‌రిగిన నాల్గో టెస్టు లో ర‌హానే నేతృత్వంలో అద్భుత విజ‌యాన్ని న‌మోదు చేసింది. రిష‌బ్ పంత్ క్లాసిక‌ల్ ఇన్నింగ్స్ దెబ్బ‌కు ఇండియా గ్రాండ్ విక్ట‌రీ సాధించింది.

Also Read : టీమిండియా విండీస్ టూర్ షెడ్యూల్

Leave A Reply

Your Email Id will not be published!