YS Sharmila: లండన్‌ లో విహరిస్తోన్న జగన్‌ కు ఇక్కడి మహిళల ఆర్తనాదాలు వినిపించవు – షర్మిల

లండన్‌ లో విహరిస్తోన్న జగన్‌ కు ఇక్కడి మహిళల ఆర్తనాదాలు వినిపించవు - షర్మిల

YS Sharmila: ఏపీ సీఎం జగన్‌ పై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రెడ్డి మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రస్తుతం లండర్ పర్యటనలో ఉన్న జగన్ ను ఉద్దేశ్యించి ఆమె తన సోషల్ మీడియా ఎక్స్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేసారు. రాష్ట్రంలో మహిళల భద్రతకు సంబంధించి వైఎస్‌ షర్మిల ఈ ట్వీట్‌ చేశారు. ‘

YS Sharmila Comment

‘నా అక్కలు, నా చెల్లెమ్మలు, నా తల్లులు, నా అవ్వలు అంటూ జగన్ మొసలి కన్నీరు కారుస్తారు. మైక్‌ ల ముందు జగన్‌ ఫేక్‌ ప్రేమ నటిస్తారు. మీ పాలనలో మహిళల భద్రత, బ్రతుకులకు పట్టిన పీడ గురించి దేశమంతా చెప్పుకొంటోంది. లండన్‌ వీధుల్లో విహరిస్తోన్న జగన్‌ కు ఇక్కడి ఆర్తనాదాలు వినిపించవు. రాష్ట్రానికి ఎందులో అత్యున్నత ర్యాంకులు రావాలో… అందులో రావు. మీరు, మీ మహిళా మంత్రులు, నాయకురాళ్లు సిగ్గుతో తలవంచుకుంటారో… మిన్నకుండిపోతున్నారో ప్రజలు గమనిస్తున్నారు’’ అని ట్వీట్‌ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Also Read : Operation Cambodia: కాంబోడియా ముఠా కబంధ హస్తాల్లో చిక్కుకున్న విశాఖ యువతకు విముక్తి !

Leave A Reply

Your Email Id will not be published!