YS Sharmila : తోబుట్టువునే వదలని జగన్ ప్రజలను ఎం గౌరవిస్తాడు
సంకర జాతి అని మహిళలను అవమానిస్తారా అని అన్నారు...
YS Sharmila : ఏపీ మహిళలను ఉద్దేశించి వైసీపీ నేత సజ్జల రామకృష్ణా రెడ్డి చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్ని రేపుతున్నాయి. సజ్జల వ్యాఖ్యలను ప్రతీ ఒక్కరూ ఖండిస్తున్నారు. తాజాగా వైసీపీ నేత చేసిన కామెంట్స్పై ఏపీపీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి(YS Sharmila) స్పందిస్తూ.. మహిళల మీద సజ్జల రామకృష్ణా రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. మూర్ఖుడిలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మహిళలను పిశాచులతో పోల్చుతారా.. మహిళలను రాక్షసులు అంటారా అంటూ ఫైర్ అయ్యారు. సంకర జాతి అని మహిళలను అవమానిస్తారా అని అన్నారు.
YS Sharmila Shocking Comments
చేసిన తప్పుకి క్షమాపణ చెప్పడానికి ఎందుకు నామోషీ అని ప్రశ్నించారు. వైసీపీ చేసిన తప్పును మళ్ళీ మళ్ళీ చేస్తోందన్నారు. ఇదే సజ్జల కొడుకు సోషల్ మీడియాను అడ్డుపెట్టుకొని తనను కూడా వదిలి పెట్టలేదన్నారు. సైతాన్ సైన్యంతో తన మీద తప్పుడు ప్రచారం చేయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ బిడ్డ అని, ఒక మహిళా అని చూడకుండా కించపరిచారన్నారు. జగన్ నా అక్క చెల్లెళ్ళు అంటారని.. కానీ జగన్ సొంత చెల్లికే మర్యాద లేదని.. ఇక రాష్ట్రంలో వీళ్ళు మహిళలకు ఏం గౌరవం ఇస్తారు అంటూ ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ పార్టీ మహాసముద్రమన్నారు. సముద్రంలో మంచితో పాటు చెత్త కూడా ఉంటుందని తెలిపారు. అప్పుడప్పుడు చెత్త పైకి వస్తుందన్నారు. పార్టీ అభివృద్ధి చెందుతుంటే లాగే వాళ్ళు కూడా ఉన్నారన్నారు. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నారన్నారు. పార్టీకి క్రమశిక్షణ కమిటీ ఉందని.. అటువంటి వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని తెలిపారు. పార్టీపై దుష్ప్రచారం చేస్తే ఊరుకునేది లేదని వైఎస్ షర్మిలా రెడ్డి హెచ్చరించారు.
Also Read : RCB Sale : ఆర్సీబీ అధినేత సంచలన నిర్ణయం..ఫ్రాంచైజ్ అమ్మకానికి సిద్ధం