Owaisi Kejriwal : ద‌మ్ముంటే కేజ్రీవాల్ ఓఖ్లాలో ప‌ర్య‌టించాలి

స‌వాల్ విసిరిన ఎంఐఎం చీఫ్ ఓవైసీ

Owaisi Kejriwal : ఎంఐఎం చీఫ్ అస‌దుద్దీన్ ఓవైసీ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయ‌న ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ పై నిప్పులు చెరిగారు. ద‌మ్ముంటే ఢిల్లీలోని ఓఖ్లా ప్రాంతంలో ప‌ర్య‌టించాల‌ని స‌వాల్ విసిరారు.

సోమ‌వారం ఢిల్లీ మ‌హాన‌గ‌ర ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొన్నారు ఓవైసీ. ఈ సంద‌ర్భంగా ఆప్ చీఫ్ పై మండిప‌డ్డారు. త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న ఈ ఎన్నిక‌ల్లో ఆప్ కు త‌గిన రీతిలో బుద్ది చెప్పాల‌ని పిలుపునిచ్చారు. మాయ మాట‌లు చెప్ప‌డంలో అర‌వింద్ కేజ్రీవాల్ మోదీని మించి పోయారంటూ ఎద్దేవా చేశారు.

ప్ర‌చార ఆర్భాటం త‌ప్ప ఢిల్లీకి ఏం చేశారంటూ నిల‌దీశారు ఓవైసీ(Owaisi Kejriwal). ఎంఐఎం ఆధ్వ‌ర్యంలో ఢిల్లీలోని షాహీన్ బాగ్ లో ఏర్పాటు చేసిన స‌భ‌లో ఆయ‌న పాల్గొని ప్ర‌సంగించారు.

ఇక్క‌డ పోటీ చేస్తున్న ఎంఐఎం అభ్య‌ర్థిని అఖండ మెజారిటీతో గెలిపించాల‌ని కోరారు ఓవైసీ. ఎవ‌రు దేశాన్ని ఏలినా ముస్లింల బ‌తుకులు బాగు ప‌డ‌డం లేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. మ‌నం కూడా ప‌వ‌ర్ లోకి వ‌స్తేనే మ‌న స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించు కోగ‌ల‌మ‌ని చెప్పారు ఓవైసీ.

ఢిల్లీ వాసుల‌కు ఉచితంగా మంచి నీళ్లు ఇస్తున్నానంటూ ప్ర‌పంచ‌మంతా ప్ర‌చారం చేసుకుంటూ ఓట్లు అడుగుతున్నాడ‌ని కేజ్రీవాల్ ఎద్దేవా చేశారు. కానీ ఇక్క‌డ చూస్తే అందుకు భిన్నంగా ఉంద‌న్నారు.

భూగ‌ర్భ జ‌లాల్లో ఉప్పు శాతం మ‌రింత ఎక్కువ‌గా ఉంద‌ని , దీనిని వాడడం వ‌ల్ల ప్ర‌జ‌లు రోగాల పాల‌వుతున్నార‌ని వాపోయారు. నీళ్ల‌వ్వ‌ని ఆప్ కు ఓట్లు ఎందుకు వేయాల‌ని ప్ర‌శ్నించారు. ముస్లింలు అత్య‌ధిక శాతం ఓఖ్లాలో నివ‌సిస్తున్నార‌ని ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క ప్ర‌భుత్వ ద‌వ‌ఖానా ఏర్పాటు చేయ‌లేద‌ని ఆరోపించారు. ద‌మ్ముంటే ఓఖ్లాకు రావాల‌ని స‌వాల్ విసిరారు.

Also Read : అబ‌ద్దాలు చెప్పడంలో మోదీ నెంబ‌ర్ వ‌న్

Leave A Reply

Your Email Id will not be published!