Rahul Gandhi : అదానీ మోసం మోదీ మౌనం – రాహుల్
నోరు ఎందుకు విప్పడం లేదు
Rahul Gandhi : ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. మరోసారి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై(PM Modi) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను చంపినా ప్రశ్నిస్తూనే ఉంటానని అన్నారు .ఈ దేశంలో ఉన్న వనరులను అప్పనంగా వ్యాపారవేత్తలకు కట్టబెడుతూ మోసం చేస్తున్నారని ఆరోపించారు. ప్రజాస్వామ్యానికి పాతర వేశారని, రాచరికానికి రాచ బాటలు వేస్తూ పవర్ ను ఎంజాయ్ చేస్తున్నారంటూ మోదీపై మండిపడ్డారు.
తాను పార్లమెంట్ సాక్షిగా లేవనెత్తిన ఏ ఒక్క ప్రశ్నకు ఇంత వరకు సమాధానం ఇవ్వలేదని ప్రధాని ఎందుకు ఉన్నట్లు అని ప్రశ్నించారు. సోమవారం కర్ణాటక ఎన్నికల ప్రచారంలో భాగంగా హుమ్నాబాద్ లో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు రాహుల్ గాంధీ(Rahul Gandhi).
మోడీకి గౌతం అదానీకి ఉన్న సంబంధం ఏమిటి, దేశంలోని ఓడ రేవులు, ఎయిర్ పోర్టులు, రోడ్లు, వ్యాపారాలు , ప్రభుత్వ సంస్థలను ఎందుకు కట్ట బెడుతున్నారో చెప్పాలని అడిగానని అన్నారు. నిజాలు ప్రశ్నిస్తున్న తనను ప్రశ్నించకుండా ఉండేందుకు ఎంపీగా అనర్హత వేటు వేశారంటూ ఆరోపించారు.
అయినా తాను ఎక్కడా ఆగనని, ప్రశ్నిస్తూనే ఉంటానని స్పష్టం చేశారు. ఈ దేశంలో అవినీతి రాజ్యమేలుతోందని , ప్రజాస్వామ్యానికి ప్రమాదం ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల కోసం, దేశం కోసం , భారత రాజ్యాంగం కోసం పోరాడుతూనే ఉంటామని స్పష్టం చేశారు రాహుల్ గాంధీ.
Also Read : పైలట్ ను పక్కన పెట్టేశారా