Rahul Gandhi : రాహుల్ దోస మేక‌ర్

ఎన్నిక‌ల ప్ర‌చారంలో హ‌ల్ చ‌ల్

Rahul Gandhi : ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ వైర‌ల్ గా మారారు. ప్ర‌స్తుతం తెలంగాణ‌లో జ‌రుగుతున్న ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొంటున్నారు. బ‌స్సు యాత్ర‌లో భాగంగా క‌రీంన‌గ‌ర్ నుండి జ‌గిత్యాల వైపు వెళుతుండ‌గా సెక్యూరిటీని కాదని దిగి పోయారు రాహుల్ గాంధీ. ఆయ‌న ఆమ్ ఆద్మీతో క‌లిసి పోవ‌డం విస్తు పోయేలా చేసింది పార్టీ శ్రేణుల‌ను, ప్ర‌జ‌ల‌ను.

Rahul Gandhi As a Common Man

తాను లీడ‌ర్ నైన‌ప్ప‌టికీ తాను సామాన్యుడినంటూ స్ప‌ష్టం చేశారు. రాహుల్ గాంధీలో(Rahul Gandhi) కీల‌క‌మైన మార్పు వ‌చ్చింది. దీనికి ప్రధాన కారణం త‌ను దేశంలో చేప‌ట్టిన భార‌త్ జోడో యాత్ర. సామాన్యులు, పేద‌లు, అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌ను , కార్మికుల‌ను, రైతుల‌ను , మ‌హిళ‌ల‌ను, చిన్నారుల‌ను క‌లుసుకున్నారు. ఈ సంద‌ర్బంగా వారితో క‌లిసి పోయారు.

తాజాగా నూక‌ప‌ల్లి వ‌ద్ద త‌న కాన్యాయ్ ను నిలిపారు. ప‌క్క‌నే ఉన్న య‌జ‌మానితో సంభాషించారు. దోసెలు ఎలా త‌యారు చేస్తావంటూ ప్ర‌శ్నించారు. అత‌డితో పాటు రాహుల్ గాంధీ సైతం దోసెలు వేయ‌డం ప్రారంభించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి.

Also Read : Minister KTR : కేటీఆర్ రైతుల‌కు ఖుష్ క‌బ‌ర్

Leave A Reply

Your Email Id will not be published!