Atishi Marlena: నాలుగో రోజు కొనసాగుతోన్న ఢిల్లీ మంత్రి ఆతిశీ దీక్ష ! క్షీణిస్తోన్న ఆరోగ్యం !

నాలుగో రోజు కొనసాగుతోన్న ఢిల్లీ మంత్రి ఆతిశీ దీక్ష ! క్షీణిస్తోన్న ఆరోగ్యం !

Atishi Marlena: దేశరాజధాని ఢిల్లీ తీవ్ర నీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో హరియాణా ప్రభుత్వం దేశ రాజధానికి నీటిని విడుదల చేయాలన్న డిమాండ్‌ తో దిల్లీ మంత్రి అతిశీ చేపట్టిన దీక్ష నాలుగో రోజుకు చేరుకుంది. సోమవారం వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆమె ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తోందని పేర్కొన్నారు. వెంటనే ఆసుపత్రిలో చేరాలని సూచించారు.

Atishi Marlena 4th Day..

ఈ సందర్భంగా మంత్రి ఆతిశీ మీడియాతో మాట్లాడుతూ… ‘‘నా రక్తపోటు, చక్కెర స్థాయిలు పడిపోతున్నాయి. బరువు తగ్గాను. దీని వల్ల భవిష్యత్తులో ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది. అయినా నేను ఢిల్లీ ప్రజల తరపున పోరాడతాను. హరియాణా నీటిని విడుదల చేసే వరకు నిరాహార దీక్షను కొనసాగిస్తా’’ అని పేర్కొన్నారు. ఎంత వేడుకున్నా హరియాణా ప్రభుత్వం రోజుకు 100 మిలియన్ గ్యాలన్ల నీటిని కూడా విడుదల చేయట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీనివల్ల దేశ రాజధానిలో 28 లక్షల మంది ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఆతిశీ దీక్షకు మద్దతుగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహిస్తామని ఆప్‌ పేర్కొంది. హరియాణా సీఎం నయాబ్ సింగ్ సైనీని కలిసి తమ సమస్యను పరిష్కరించాలని కోరామని, ఆయన సానుకూలంగా స్పందించినట్లు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా వెల్లడించారు.

Also Read : KTR : కాంగ్రెస్ సర్కార్ కు గుణపాఠం తప్పదంటూ వైరల్ అవుతున్న కేటీఆర్ ట్వీట్

Leave A Reply

Your Email Id will not be published!