Vijayashanti : అబ‌ద్దాలు ఆడ‌డంలో కేసీఆర్ దిట్ట

నిప్పులు చెరిగిన రాముల‌మ్మ

Vijayashanti : సీఎం కేసీఆర్ పై నిప్పులు చెరిగారు బీజేపీ నాయ‌కురాలు విజ‌య‌శాంతి. ఆయ‌న ఏది మాట్లాడినా అందులో నిజం అంటూ ఇసుమంతైనా ఉండ‌ద‌న్నారు.

ఇప్ప‌టి దాకా చెప్పిన మాట‌కు క‌ట్టుబ‌డిన దాఖ‌లాలు లేవ‌న్నారు. త‌న అస‌భ్య ప‌ద‌జాలంతో భార‌త జ‌వాన్ల‌ను కూడా కించ ప‌రిచారంటూ మండిప‌డ్డారు. ఇవాళ వికారాబాద్ జిల్లా కంక‌ల్ లో ఛ‌త్ర‌ప‌తి శివాజీ విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించారు.

అనంత‌రం విజ‌య‌శాంతి ప్ర‌సంగించారు. ఈ సంద‌ర్భంగా కేసీఆర్ ను టార్గెట్ చేశారు. తెలంగాణ రాష్ట్రం వ‌చ్చాక ఎనిమిదేళ్లు గ‌డిచినా ఈరోజు వ‌ర‌కు ఇచ్చిన హామీల‌లో ఒక్క‌దానినైనా నెర‌వేర్చారా అని ప్ర‌శ్నించారు.

ఆయ‌న నోరు తెరిస్తే అన్నీ అబ‌ద్దాలే ఉంటున్నాయ‌ని ఎద్దేవా చేశారు. పార్ల‌మెంట్ లో తెలంగాణ బిల్లు పెట్టిన స‌మ‌యంలో కేసీఆర్ లేనే లేడ‌ని మండిప‌డ్డారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం భార‌తీయ జ‌న‌తా పార్టీ స‌పోర్ట్ చేసింద‌న్న విష‌యం మ‌రిచి పోవ‌ద్ద‌ని సూచించారు. డ‌బ్బు, అధికారం ఉంద‌నే అహంకారంతో ఎవ‌రినంటే వారిని ఇష్టానుసారం మాట్లాడుతున్న‌రాని ఫైర్ అయ్యారు విజ‌య‌శాంతి(Vijayashanti).

ప‌వ‌ర్ ఉంద‌ని మిడిసి ప‌డుతూ కేసీఆర్ నియంత‌లా వ్య‌వ‌హ‌రిస్తున్నారంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ప్ర‌జ‌లు దీనిని గ‌మ‌నిస్తున్నార‌ని చెప్పారు.

రాష్ట్రంలో టీఆర్ఎస్ ను ఢీకొనే స‌త్తా ఒక్క బీజేపీకే ఉంద‌న్నారు రాముల‌మ్మ‌. రోజు రోజుకు త‌మ పార్టీకి జ‌నాద‌ర‌ణ ల‌భిస్తోంద‌న్నారు. రాబోయేది త‌మ ప్ర‌భుత్వ‌మేన‌ని జోస్యం చెప్పారు.

ఓ వైపు కొలువు రాక నిరుద్యోగులు, మ‌ద్ద‌తు ధ‌ర రాక రైతులు ఆత్మ‌హ‌త్య‌లు చేసుకుంటుంటే కేసీఆర్ ప‌ట్టించు కోవ‌డం లేద‌ని ఆరోపించారు విజ‌య‌శాంతి. రాబోయే రోజులలో ప్ర‌జ‌లు త‌గిన రీతిలో ఝ‌లక్ ఇవ్వ‌డం ఖాయ‌మ‌న్నారు.

Also Read : బీజేపీని బొంద పెడ‌తం కాంగ్రెస్ ను తొక్కేస్తం

Leave A Reply

Your Email Id will not be published!