USA : అమెరికాలో కాల్పులకు బాపట్ల యువకుడు ‘గోపికృష్ణ’ మృతి

జీవనోపాధి కోసం గోపీకృష్ణ ఎనిమిది నెలల క్రితం అమెరికా వెళ్లాడు...

USA : అమెరికాలో ఓ దారుణం చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల జిల్లాకు చెందిన దాసరి గోపీకృష్ణ (32)ను దుండగులు ఎదురుకాల్పుల్లో హత్య చేశారు. గోపీ అర్కెనాథ్‌లోని ఓ సూపర్‌మార్కెట్‌లో పనిచేస్తున్నాడు. శనివారం మధ్యాహ్నం గోపీకృష్ణ కౌంటర్‌లో కూర్చొని ఉండగా అకస్మాత్తుగా ఓ దుండగుడు లోపలికి వచ్చి తుపాకీతో కాల్చి చంపిన అనంతరం దుండగుడు కొన్ని సామాన్లు తీసుకుని పరారయ్యాడు. ఈ ఘటనలో గోపికి తీవ్ర గాయాలయ్యాయి. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతి చెందాడు. మృతుడు యాజరి కర్లపాలెం మండలం బాపట్ల ప్రాంతానికి చెందిన స్వస్థలంగా గుర్తించారు.

USA…

జీవనోపాధి కోసం గోపీకృష్ణ ఎనిమిది నెలల క్రితం అమెరికా వెళ్లాడు. ఆర్కేనాథ్ రాష్ట్రంలోని ఓ సూపర్ మార్కెట్‌లో పనిచేస్తున్నాడు. ఈ వార్త విన్న గోపీకృష్ణ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు. దీంతో గోపి స్వగ్రామం యాజరిలో విషాదఛాయలు అలుముకున్నాయి. మరోవైపు దుండగుడు కాల్పులు జరుపుతున్న దృశ్యాలు సమీపంలోని సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. అర్కేనాథ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Also Read : YSRCP Office: తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైసీపీ కార్యాలయం కూల్చివేత !

Leave A Reply

Your Email Id will not be published!