Air Chief Marshal: ఆయుధాలు, ఆయుధ వ్యవస్థపై ఎయిర్ చీఫ్ మార్షల్ సంచలన వ్యాఖ్యలు

ఆయుధాలు, ఆయుధ వ్యవస్థపై ఎయిర్ చీఫ్ మార్షల్ సంచలన వ్యాఖ్యలు

Air Chief Marshal : పహాల్గాం ఉగ్రదాడి తరువాత భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్(Operation Sindoor), అదేవిధంగా పాకిస్తాన్ డ్రోన్ దాడులను ఎదుర్కొనే తీరుతో మన ఆయుధ సంపత్తి ఎంత ముఖ్యమైనదో ప్రపంచానికి తెలిసింది. సుఖోయ్, రాఫెల్, తేజస్ ఇలా చాలా యుద్ధవిమానాలు ప్రయోగించిన తీరు… యావత్ ప్రపంచం కూడా ప్రత్యక్షంగా చూసింది. మన యొక్క ఆధునిక సాంకేతికను ఉపయోగించి… పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్రవాద స్థావరాలను ఖచ్చితంగా గురిచేసిన నేలమట్టం చేసిన తీరు… మన యొక్క ఆయుద సంపత్తికి ఒక తార్కాణం లాంటిది. అయితే ఇలాంటి సమయంలో ఆయుధాలు, ఆయుధ వ్యవస్థల ఉత్పత్తిపై ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ అమర్‌ప్రీత్‌ సింగ్‌ సంచలన వ్యాఖ్యలు చేసారు. సాక్ష్యాత్తూ రక్షణ మంత్రి సమక్షంలోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

Air Chief Marshal Sensational Comments

ఢిల్లీ వేదికగా నిర్వహిస్తున్న సీఐఐ వార్షిక సదస్సులో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ సమక్షంలోనే అమర్‌ప్రీత్‌ సింగ్‌(Amar Preet Singh) మాట్లాడుతూ… ఆయుధాలు, ఆయుధ వ్యవస్థల ఉత్పత్తిలో మన దేశ సంస్థలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. ఆయుధాల సరఫరా కోసం కాంట్రాక్టుల మీద సంతకాలైతే చేస్తున్నారు కానీ, సరఫరా మాత్రం జరగదని వ్యాఖ్యానించారు. ఇప్పటివరకు ఒక్క ప్రాజెక్టు కూడా అనుకున్న సమయంలో పూర్తికాలేదని, సమయానికి ఇవ్వలేనప్పుడు ఎందుకు వాగ్దానాలు చేయాలని ప్రశ్నించారు. ఈ సందర్భంగా ‘నేను ఒక్కసారి కమిటైతే.. నా మాట నేనే వినను’ అనే సినిమా డైలాగ్‌ను గుర్తు చేశారు. దేనికైనా కట్టుబడితే గడువులోగా పూర్తి చేయాలని పేర్కొన్నారు. దేశీయంగా రక్షణ వ్యవస్థల ఉత్పత్తిని పెంచడానికి, మేకిన్‌ ఇండి యా కోసం వాయుసేన కృషి చేస్తోందని చెప్పారు.

‘‘రక్షణ పరికరాలు, ఆయుధాల సరఫరాలో నిర్ధారిత గడువు అన్నదే లేకుండా పోయింది. 83 తేజస్‌ ఎంకే1ఏ యుద్ధ విమానాల సరఫరా కోసం హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఏఎల్‌)తో 2021 ఫిబ్రవరిలో రూ.48 వేల కోట్ల కాంట్రాక్టు కుదిరింది. 2024 మార్చి నుంచే విమానాల డెలివరీ మొదలుకావాలి. కానీ ఇప్పటివరకు ఒక్కటి కూడా అందజేయలేదు. గతంలో తేజస్‌ ఎంకే1 విమానాల సరఫరాలోనూ జాప్యం జరిగింది. తేజస్‌ ఎంకే2 ప్రొటోటైప్‌ అందాల్సి ఉంది. ఆమ్కా ఫైటర్‌కు సంబంధించి ప్రొటోటైప్‌ కూడా సిద్ధంకాలేదు. మన దేశంలో ఉత్పత్తి చేయడం కాదు, మన దేశంలోనే రూపొందించడం, అభివృద్ధి చేయడం (డిజైన్‌ అండ్‌ డెవల్‌పమెంట్‌)పై దృష్టిపెట్టాలి. సైనిక దళాలకు, పరిశ్రమకు మధ్య విశ్వాసం నెలకొనాలి. దేనికైనా కట్టుబడితే గడువులోగా అందించాలి. ప్రాణం పోయినా పర్లేదు, మాట పోవద్దనే సూక్తిని గుర్తుంచుకోవాలి’’ అని అమర్‌ప్రీత్‌సింగ్‌ పేర్కొన్నారు.

Also Read : CM Chandrababu Naidu: కడప నుండి నేరుగా ఢిల్లీకి చేరుకున్న సీఎం చంద్రబాబు

Leave A Reply

Your Email Id will not be published!