Akhilesh Yadav : గెలిపించండి ‘నేతాజీ’ పేరు నిల‌బెట్టండి

ప్ర‌జ‌ల‌ను కోరిన అఖిలేష్ యాద‌వ్

Akhilesh Yadav : ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లోని మెయిన్ పురిలో ప్ర‌స్తుతం ఉప ఎన్నిక జ‌ర‌గ‌నుంది. ఇక్క‌డ స‌మాజ్ వాది పార్టీకి గ‌ట్టి ప‌ట్టుంది. ఇప్ప‌టికే ఆ పార్టీ చీఫ్‌, మాజీ సీఎం అఖిలేష్ యాద‌వ్ అన్నీ తానై ప్ర‌చారం చేస్తున్నారు. ఇప్ప‌టికే ఆయ‌న త‌న తండ్రిని కోల్పోయారు. దేశ రాజ‌కీయాల‌లో ప్ర‌ధానంగా యూపీలో చెర‌గ‌ని ముద్ర వేశారు ములాయం సింగ్ యాద‌వ్.

ఆయ‌న‌ను అక్క‌డి వారు నేతాజీ అని గౌర‌వంతో పిలుచుకుంటారు. త‌న తండ్రి మ‌ర‌ణంలో ఖాళీ అయ్యింది మెయిన్ పురి నియోజ‌క‌వర్గం. త‌న మామ శివ‌పాల్ యాద‌వ్ ను కూడా అఖిలేష్ యాద‌వ్(Akhilesh Yadav)  క‌లుసుకున్నారు. ఇక్క‌డ ఎస్పీ త‌ర‌పున త‌న భార్య డింపుల్ యాద‌వ్ ను బ‌రిలోకి దింపారు అఖిలేష్ యాద‌వ్.

ఇదిలా ఉండ‌గా ఎలాగైనా స‌రే ఎస్పీ అభ్య‌ర్థిని ఓడించాల‌ని యూపీలో కొలువు తీరిన సీఎం యోగి ఆదిత్యానాథ్ పావులు క‌దుపుతున్నారు. ఆయ‌న సార‌థ్యంలో బీజేపీ రెండోసారి ప‌వ‌ర్ లోకి వ‌చ్చింది. ఈ త‌రుణంలో ఇక్క‌డ నువ్వా నేనా అన్నంత పోటీ నెల‌కొంది. ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా సోమ‌వారం అఖిలేష్ యాద‌వ్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

త‌మ‌ను గెలిపించాల‌ని నేతాజీ పేరు నిల‌బెట్టాల‌ని పిలుపునిచ్చారు. ఈ ప్రాంతంలోని ప్ర‌తి చోటా నేతాజీ ఉన్నారు. ఆయ‌న భౌతికంగా ఇక్క‌డ లేక పోవ‌చ్చు. కానీ ఇక్క‌డ పుట్టిన ప్ర‌తి వారంద‌రిలో త‌న తండ్రి ఉన్నార‌ని భావోద్వేగంతో అన్నారు. ఇక్క‌డ వేసే ప్ర‌తి ఓటు నేతాజీ పేరు మీద ఉంటుంద‌ని చెప్పారు అఖిలేష్ యాద‌వ్(Akhilesh Yadav) .

Also Read : మ‌హ‌నీయుడికి మ‌ర‌ణం లేదు

Leave A Reply

Your Email Id will not be published!