Amit Malviya : రౌత్ కు పట్టిన గతే సిసోడియాకు కూడా
బీజేఐ ఐటీ సెల్ హెడ్ అమిత్ మాల్వియా
Amit Malviya : భారతీయ జనతా పార్టీ ఐటీ సెల్ హెడ్ అమిత్ మాల్వియా సంచలన కామెంట్స్ చేశారు. శివసేన పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, ఎంపీ సంజయ్ రౌత్ కు పట్టిన గతే ఢిల్లీ ఆప్ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు(Manish Sisodia) పడుతుందని జోష్యం చెప్పారు. తప్పు చేసిన వారు ఎవరైనా సరే జైలు ఊచలు లెక్క పెట్టాల్సిందేనని పేర్కొన్నారు.
ట్విట్టర్ వేదికగా అమిత్ మాల్వియా కీలక వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది. ప్రస్తుతం ఆప్ వర్సెస్ బీజేపీ మధ్య యుద్దం నడుస్తోంది. గతంలో కూడా ఇలాగే బీరాలు పలికారు సంజయ్ రౌత్. చివరకు ఏమైంది . తాను తప్పు చేయలేదని పేర్కొన్నారు. ఆపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ,
కేంద్ర సర్కార్ ను ఇష్టానుసారం ఆరోపణలు చేశారు. కానీ చివరకు ఈడీ చేతిలో జైలు పాలయ్యాడని గుర్తు చేశారు. ఆప్ చీఫ్ కేజ్రీవాల్ తో పాటు నాయకులంతా తాము నీతి పరులం అంటూ ప్రగల్భాలు పలుకుతుంటారని మద్యం స్కాం విషయంలో ఎవరి పాత్ర ఏమిటో బయటకు చెప్పాలని డిమాండ్ చేశారు అమిత్ మాల్వియా(Amit Malviya).
ఇదిలా ఉండగా తన వద్ద ఎలాంటి ఆధారాలు లభించ లేదని, కానీ కక్ష సాధింపు ధోరణితో ఫేక్ కేసు పెట్టారంటూ ఆరోపించారు డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా. 14 గంటల పాటు సీబీఐ సోదాలు చేపట్టింది. వాళ్లకు ఏమీ దొరకలేదు.
ప్రధాన మంత్రి మోదీ ఒత్తిళ్లకు తలొగ్గి దాడులకు తెగ పడుతున్నాయంటూ మండిపడ్డారు డిప్యూటీ సీఎం. దీనిపై సీరియస్ గా స్పందించారు అమిత్ మాల్వియా. ఎన్ని నీతి సూత్రాలు వల్లెవేసినా చేసిన అక్రమాలకు ఒక్కటొక్కటిగా బయటకు రావడం ఖాయమన్నారు.
Also Read : జైలు తాళాలు తెంచే రోజు వస్తుంది – కేజ్రీవాల్