Amit Shah : క‌మ‌లం గెలుపు అభివృద్దికి మ‌లుపు

ఈసారి ఎన్నిక‌ల్లో బీజేపీదే విజ‌యం

Amit Shah : జ‌న‌గాం – అభివృద్ది కావాలంటే క‌మ‌లం గుర్తుకు ఓటు వేయాల‌ని కోరారు కేంద్ర హొం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా(Amit Shah). తెలంగాణ ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా జ‌న‌గాంలో జ‌రిగిన స‌భ‌లో ఆయ‌న పాల్గొని ప్ర‌సంగించారు. ఈసంద‌ర్భంగా రాష్ట్రంలో కొలువు తీరిన బీఆర్ఎస్ ప్ర‌భుత్వాన్ని ఏకి పారేశారు. అవినీతికి కేరాఫ్ గా మారింద‌న్నారు. తాము గ‌నుక ప‌వ‌ర్ లోకి వ‌స్తే వ‌చ్చిన వెంట‌నే విచార‌ణకు ఆదేశిస్తామ‌ని స్ప‌ష్టం చేశారు.

Amit Shah Comment

ఆచ‌ర‌ణ‌కు నోచుకోని హామీలు ఇస్తూ ఇన్నేళ్లుగా తెలంగాణ పేరుతో దోపిడీకి తెర లేపార‌ని, కేవ‌లం త‌మ కుటుంబం మాత్ర‌మే బాగు ప‌డింది త‌ప్ప ప్ర‌జ‌లు ఏ ఒక్క‌రు బాగు ప‌డ‌లేద‌న్నారు. ఇవాళ విద్య‌, వైద్యం అట‌కెక్కింద‌న్నారు. త‌మ‌ను ఆశీర్వ‌దిస్తే ఉచితంగా ద‌శ‌ల వారీగా ప్ర‌తి ఒక్క‌రికీ అయోధ్య లోని రామ మందిరాన్ని ద‌ర్శించుకునే భాగ్యాన్ని క‌ల్పిస్తామ‌ని చెప్పారు అమిత్ చంద్ర షా.

ఈ దేశంలో సుస్థిర‌మైన అభివృద్దిని, స‌మ‌ర్థ‌వంత‌మైన పాల‌నను అందించే ఏకైక స‌త్తా క‌లిగిన పార్టీ ఒక్క బీజేపీనేన‌ని స్ప‌ష్టం చేశారు. కాంగ్రెస్ , బీఆర్ఎస్ రెండూ ఒక్క‌టేన‌ని ఆరోపించారు. ఈ రెండు పార్టీలు కుటుంబ పార్టీలంటూ మండిప‌డ్డారు. దీనికి తోడు ఎంఐఎం కూడా దాని కోవ‌కు చెందిన‌దేనంటూ ఎద్దేవా చేశారు.

Also Read : Chandra Babu Case : చంద్ర‌బాబుకు ఏసీబీ కోర్టు షాక్

Leave A Reply

Your Email Id will not be published!