UPSC Results 2021 : సివిల్స్ లో మెరిసిన తెలుగు తేజాలు

య‌శంత్ రెడ్డికి 15, పూస‌పాటి సాహిత్య‌కు 25వ ర్యాంకు

UPSC Results 2021 : దేశ వ్యాప్తంగా ప్ర‌తిష్టాత్మ‌కంగా భావించే యూపీఎస్సీ సివిల్స్ స‌ర్వీసెస్ 2021 (UPSC Results 2021) ప‌రీక్ష‌ల‌కు సంబంధించి ఫైన‌ల్ రిజ‌ల్ట్స్ సోమ‌వారం ప్ర‌క‌టించింది. వ‌రుస‌గా టాప్ లో 1, 2, 3 ర్యాంకులను మ‌హిళ‌లే చేజిక్కించు కున్నారు.

తెలుగు రాష్ట్రాలు ఏపీ, తెలంగాణ‌కు చెందిన అభ్య‌ర్థులు సివిల్స్ ప‌రీక్ష‌ల్లో మెరిశారు. త‌మ‌దైన ప్ర‌తిభ‌తో రాణించారు. ర్యాంకులు పొందారు. వారిలో య‌శ్వంత్ కుమార్ రెడ్డికి 15వ ర్యాంకు ద‌క్కింది.

ఇక పూస‌పాటి సాహిత్య కు జాతీయ స్థాయిలో 24వ ర్యాంకు సాధించింది. శృతి రాజ్య‌ల‌క్ష్మికి 25వ ర్యాంకు ల‌భించింది. ర‌వికుమార్ కు 38వ ర్యాంకు ల‌భించింది. ఇక కొప్పిశెట్టి కిర‌ణ్మ‌యికి 56వ ర్యాంకు ద‌క్క‌డం విశేషం.

వీరితో పాటు పాణిగ్ర‌హి కార్తీక్ కు 63వ ర్యాంకు ద‌క్క‌గా గ‌డ్డం సుధీర్ కుమార్ కు 69వ ర్యాంకు ల‌భించింది. శైల‌జ 83వ ర్యాంకు సాధించ‌గా శివానందం 87వ ర్యాంకు పొందారు.

ఆకునూరి న‌రేష్ 117వ ర్యాంకు ద‌క్కించు కోగా అరుగుల స్నేహ‌కు 136వ ర్యాంకు ల‌భించింది. ఇక గ‌డిగె విన‌య్ కుమార్ కు 151వ ర్యాంకు ద‌క్క‌గా దివ్యాన్లు శుక్లాకు 153వ ర్యాంకు ద‌క్కింది.

క‌న్నె ధార మ‌నోజ్ కుమార్ కు 157వ ర్యాంకు ల‌భించ‌గా బొక్కా చైత‌న్య రెడ్డికి 161 ర్యాంక్ ల‌భించ‌గా దొంతుల జీన‌త్ చంద్ర‌ 201వ ర్యాంకు సాధించాడు.సాస్య రెడ్డికి సివిల్స్ జాతీయ స్థాయిలో 214వ ర్యాంకు ద‌క్క‌డం విశేషం.

685 మంది అభ్య‌ర్థులు ప్ర‌తిష్టాత్మ‌క‌మైన ప‌రీక్ష‌కు అర్హ‌త సాధించారు. సివిల్స్ లో ముగ్గురు మ‌హిళ‌లు టాప్ లో ఉండ‌డం గ‌మ‌నార్హం. 

Also Read : సివిల్ స‌ర్వీసెస్ టాప‌ర్ గా శ్రుతి శ‌ర్మ‌

Leave A Reply

Your Email Id will not be published!