AP CM YS Jagan : రూ. 600 కోట్లతో 8 వేల మందికి ఉపాధి
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి వెల్లడి
AP CM YS Jagan : విశాఖపట్టణంలో ల్యాండ్ మార్క్ ప్రాజెక్ట్ గా రానున్న ఇన్ ఆర్బిట్ మాల్ స్థాపన కార్యక్రమానికి మంగళవారం శంకుస్థాపన చేశారు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి. 15 ఎకరాల స్థలంలో రూ. 600 కోట్లతో దీనిని నిర్మించనున్నారు రహేజా కంపెనీ. ఈ మాల్ పూర్తవుతే ప్రత్యక్షంగా, పరోక్షంగా 8,000 మందికి ఉపాధి కలుగుతుందని స్పష్టం చేశారు ఏపీ సీఎం.
AP CM YS Jagan Starts
ఫేజ్ 1 లో ఇనార్బిట్ మాల్ నిర్మాణం పూర్తవుతుందన్నారు. ఆరు వందల కోట్ల పెట్టుబడి పెట్టడం అభినందనీయమన్నారు జగన్ రెడ్డి(AP CM YS Jagan). భారీ ఎత్తున ఇన్వెస్ట్ చేయడం వల్ల ఎంతో మేలు జరుగుతుందని పేర్కొన్నారు. స్థానికులకు పెద్ద ఎత్తున జాబ్స్ లభిస్తాయని వెల్లడించారు.
6 లక్షల చదరపు అడుగులలో మాల్ , 4 లక్షల చదరపు అడుగుల పార్కింగ్ ప్రాంతం, 2026లో పూర్తి చేసేలా ప్లాన్ ఉంటుందన్నారు. 250 జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్ స్టోర్స్ , మల్టిప్లెక్స్ లు, ఫ్యామిలీ ఎంటర్ టైన్ మెంట్ సెంటర్ , ఫుడ్ కోర్డు, టెర్రస్ గార్డెన్ , షాపింగ్ స్పేస్ మాల్ లో ఉంటాయని స్పష్టం చేశారు జగన్ మోహన్ రెడ్డి.
ఫేజ్ 2లో దాదాపు 3,000 మంది ఉద్యోగులకు సరి పడేలా 2.5 లక్షల చదరపు అడుగులు ఆఫీస్ స్పేస్ 2027 నాటికి సిద్దమయ్యేలా ప్రణాళిక తయారు చేశారని తెలిపారు సీఎం.
Also Read : KTR : ప్రభుత్వ విజయాలు ప్రజల్లోకి – కేటీఆర్