AP Liquor Scam: సిట్ కస్టడీకి ఏపీ లిక్కర్ స్కామ్‌ నిందితులు

సిట్ కస్టడీకి ఏపీ లిక్కర్ స్కామ్‌ నిందితులు

AP Liquor Scam : ఏపీ లిక్కర్ స్కామ్‌ లో నిందితులను కస్టడీకి అప్పగించాలంటూ ఏసీబీ కోర్టులో సిట్(SIT) అధికారులు పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో నిందితులు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని మూడు రోజులు… అలాగే ధనుంజయ రెడ్డి, కృష్ణ మోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పలను వారం రోజులపాటు తమ కస్టడీకి అప్పగించాలంటూ పిటిషన్‌లో పేర్కొన్నారు. పిటిషన్‌ పై వాదనలు పూర్తికావడంతో ఏసీబీ కోర్టు గురువారం తీర్పు వెల్లడించింది. నలుగురు నిందితులను రెండు జులపాటు కస్టడీకి అనుమతించింది. ఈనెల 30, 31 తేదీల్లో ఉదయం 8 గంటల నుంచీ సాయంత్రం 6 గంటల వరకూ విచారించేందుకు సిట్ అధికారులకు అనుమతించింది. న్యాయవాది సమక్షంలో విచారణ జరపాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.

AP Liquor Scam Victims

కాగా, ఏపీ లిక్కర్ స్కాంపై(AP Liquor Scam) పూర్తిగా దర్యాప్తు చేయాలని కూటమి ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేసింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగానే కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. అతడు చెప్పిన వివరాలు ఆధారంగా విశ్రాంతి ఐఏఎస్ అధికారి ధనుంజయ్ రెడ్డి, మాజీ సీఎం జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డిలతోపాటు బాలాజీ గోవిందప్పను పోలీసు అధికారులు అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. అయితే, వీరిని తమ విచారణకు అప్పగించాలంటూ సిట్ అధికారులు ఏసీబీ కోర్టును ఆశ్రయించారు. అయితే, ఇప్పటికే కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని సిట్ అధికారులు ఒకసారి కస్టడీకి తీసుకుని విచారించారు. మరోసారి అతడిని కస్టడీకి అప్పగించాలంటూ సిట్ అధికారులు కోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో రెండ్రోజుల కస్టడీకి అనుమతినిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

అయితే, ఈ కేసులో అరెస్టు అయ్యి రిమాండ్‌లో ఉన్న బాలాజీ గోవిందప్ప… తన అనారోగ్య రీత్యా బయట నుంచి ఆహారం తెచ్చుకునేందుకు కోర్టు అనుమతి కోరారు. సోమ, బుధ , శుక్రవారాల్లో బయట నుంచి భోజనం తెప్పించుకునేందుకు ఎసీబీ కోర్టు అనుమతించింది. జైలు అధికారి పర్యవేక్షణలో ఈ భోజనం గోవిందప్పకు అందాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Also Read : AP High Court: ప్రభుత్వానికి హైకోర్టు షాక్ ! కడప మేయర్‌ తొలగింపుపై స్టే !

Leave A Reply

Your Email Id will not be published!