Asaduddin Owaisi: పాకిస్తాన్ ప్రధాని, ఆర్మీ చీఫ్ లపై ఒవైసీ సంచలన వ్యాఖ్యలు
పాకిస్తాన్ ప్రధాని, ఆర్మీ చీఫ్ లపై ఒవైసీ సంచలన వ్యాఖ్యలు
Asaduddin Owaisi : పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆ దేశ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ లను ఉద్దేశ్యించి హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆ దేశ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ ఇద్దరూ తెలివి తక్కువ జోకర్లు అని వ్యాఖ్యానించారు. ఈ జోకర్లు భారత్ తో పోటీ పడాలనుకుంటున్నారంటూ ఎద్దేవా చేశారు. సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్ నిజస్వరూపాన్ని ప్రపంచ దేశాల ముందు ఎండగట్టడానికి… భారత ప్రభుత్వం విదేశాలకు పంపించిన అఖిలపక్షం బృందంలో ఉన్న అసదుద్దీన్ ఒవైసీ(Asaduddin Owaisi)… కువైట్ పర్యటనలో ఈ వ్యాఖ్యలు చేసారు. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే…
Asaduddin Owaisi Slams
అంతర్జాతీయ వేదికలపై పాకిస్థాన్ కుటిల నీతి, కుట్రలను ఎండగట్టేందుకు భారత ఎంపీ ప్రతినిధుల బృందాలు విదేశాల్లో పర్యటిస్తున్నాయి. ప్రస్తుతం కువైట్లో పర్యటిస్తున్న బృందంలో ఒవైసీ కూడా ఉన్నారు. ఈ సందర్భంగా కువైట్లోని భారతీయ సంతతి పౌరులనుద్దేశించి ఒవైసీ మాట్లాడారు. ఆపరేషన్ సిందూర్ కు ప్రతికార చర్యగా తాము ‘ఆపరేషన్ బున్యాన్-ఉన్-మర్సూస్’ నిర్వహించి విజయం సాధించామని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ తప్పుడు ప్రచారంతో మభ్యపెట్టేందుకు ప్రయత్నం చేయడం వారి తెలివి తక్కువ తనానికి నిదర్శనమని అన్నారు. ఈ జోకర్లు భారత్ తో పోటీ పడాలనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. 2019 నాటి చైనా ఆర్మీ డ్రిల్ ఫొటోను చూపుతూ భారత్ పై విజయమని చెప్పుకుంటున్నారని ఒవైసీ విమర్శించారు.
Also Read : Paka Satyanarayana : విజయసాయి రెడ్డి స్థానంలో రాజ్యసభ ఎంపీగా ‘పాక వెంకట సత్యనారాయణ’