Virat Kohli: బెంగళూరులో క్రికెటర్‌ కోహ్లీ పబ్‌పై కేసు

బెంగళూరులో క్రికెటర్‌ కోహ్లీ పబ్‌పై కేసు

Virat Kohli : టీమిండియా స్టార్ బ్యాట్స్ మెన్ విరాట్‌ కోహ్లీకి చెందిన బెంగళూరులోని పబ్, రెస్టారెంట్‌ ‘ఒన్‌ 8 కమ్యూన్‌’ మరోసారి వార్తల్లోకెక్కింది. మే 29న సోదాలు చేపట్టిన పోలీసులు స్మోకింగ్‌ జోన్‌ లేని విషయాన్ని గుర్తించారు. ఇందుకు సంబంధించి మే 31న కేసు నమోదు చేశారు.

Virat Kohli Pub Case

స్థానిక మహాత్మాగాంధీ రోడ్డులో ఉన్న ఈ రెస్టారెంట్, పబ్‌ కు సహయజమానిగా ఉన్న కోహ్లీకి, సిబ్బందికి నోటీసులు సైతం జారీ చేశారు. హోటళ్లు, రెస్టారెంట్లు, విమానాశ్రయాలు తదితర ప్రాంతాల్లో తప్ప నిసరిగా స్మోకింగ్‌జోన్‌ లను ఏర్పాటు చేయాలి. అయితే, ‘ఒన్‌ 8 కమ్యూన్‌’గతంలోనూ ఉల్లంఘనలకు పాల్పడిన సందర్భాలున్నాయి. 2024 జూలై 6న అర్ధరాత్రి దాటాక 1.20 గంటల వరకు పబ్‌ను తెరిచే ఉంచడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. అగ్నిమాపక శాఖ నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోలేదంటూ గతేడాది డిసెంబర్‌లో నగర పాలక సంస్థ నోటీసులు పంపింది.

Also Read : IndiGo Flight: ఇండిగో విమానాన్ని ఢీకొట్టిన పక్షి ! తృటిలో తప్పిన పెను ప్రమాదం !

Leave A Reply

Your Email Id will not be published!