Bengaluru: తాజ్‌ వెస్ట్‌ ఎండ్‌ హోటల్‌ కు బాంబు బెదిరింపు అప్రమత్తమైన బెంగళూరు పోలీసులు

తాజ్‌ వెస్ట్‌ ఎండ్‌ హోటల్‌ కు బాంబు బెదిరింపు అప్రమత్తమైన బెంగళూరు పోలీసులు

బెంగళూరులోని తాజ్‌ వెస్ట్‌ ఎండ్‌ హోటల్‌కు బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో అధికారులు పోలీసుల ఆ ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. బెంగళూరులోని తాజ్‌ వెస్ట్‌ ఎండ్‌ హోటల్‌కు బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో అధికారులు ఆ ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. కర్ణాటక రాజధాని బెంగళూరు లోని ప్రముఖ తాజ్‌ వెస్ట్‌ ఎండ్‌ హోటల్‌ కు బాంబు బెదిరింపు కాల్‌ వచ్చింది. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. గుర్తుతెలియని వ్యక్తులు ఈ- మెయిల్‌ ద్వారా బెదిరింపులకు పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

ఉగ్రముప్పు హెచ్చరికలు..

బెంగళూరులోని రేస్‌కోర్స్‌ ప్రాంతంలోని తాజ్‌ వెస్ట్‌ ఎండ్‌ హోటల్‌లో రాజకీయ నాయకులు, క్రికెటర్లు, ప్రముఖులు బస చేస్తుంటారు. ఈ ప్రముఖ హోటల్‌కు శనివారం బాంబు బెదిరింపులు వచ్చాయి. గుర్తు తెలియని వ్యక్తులు ఈ- మెయిల్‌ ద్వారా బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు, బాంబుస్వ్కాడ్‌ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని తనిఖీలు చేపట్టారు. అప్రమత్తమైన పోలీసులు హోటల్‌ వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇప్పటివరకు ఎలాంటి అనుమానాస్పద వస్తువును గుర్తించలేదు. దీనిపై విచారణ జరుగుతోందని అధికారులు వెల్లడించారు.

Leave A Reply

Your Email Id will not be published!