Bengaluru Stampede: 100 కోట్ల ఆస్తి ఉన్న బీటెక్‌ విద్యార్థి బెంగుళూరు తొక్కిసలాటలో మృతి

100 కోట్ల ఆస్తి ఉన్న బీటెక్‌ విద్యార్థి బెంగుళూరు తొక్కిసలాటలో మృతి

Bengaluru Stampede : రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టు తొలిసారిగా ఐపీఎల్ కప్పును కైవసం చేసుకున్న సందర్భంగా బెంగుళూరు చిన్న స్వామి స్టేడియంలో ఏర్పాటు చేసిన విజయోత్సవంలో జరిగిన తొక్కిసలాటలో 11 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ తొక్కిసలాటలో(Bengaluru Stampede) హాసన్‌ జిల్లా వాసి భూమిక్‌ (20) ఇంటిలో చెప్పకుండా ఈ కార్యక్రమానికి వచ్చి విగతజీవి అయ్యాడు. దీనితో ఇంజనీరింగ్‌ చదువుతున్న భూమిక్‌ మృతితో తండ్రి తల్లడిల్లిపోతున్నారు. భూమిక్ నీకోసం 100 కోట్ల రూపాయల ఆస్తిని సంపాదించి పెట్టానంటూ… కొడుకు శవం వద్ద తండ్రి బోరుమంటున్న తీరు అందరినీ కలిచివేసింది.

హాసన్‌ జిల్లా బేలూరు తాలూకా కుప్పుగోడుకు చెందిన లక్ష్మణ, అశ్విని దంపతులకు ఏకైక కుమారుడు భూమిక్‌. బెంగళూరులో(Bengaluru Stampede) ఉంటు ఇంజినీరింగ్‌ రెండో ఏడాది చదువుతున్నాడు. కాలేజీ స్నేహితులతో కలిసి చిన్నస్వామి స్టేడియం వద్దకెళ్లి తొక్కిసలాటలో మరణించాడు. విక్టోరియా ఆస్పత్రిలో గురువారం పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. దీనితో కుమారుడు మృతదేహం వద్ద తల్లిదండ్రులు విలపించిన తీరు… యావత్ ప్రపంచాన్ని కలచివేసింది. ఒక్కగానొక్క కుమారుడి కోసం సుమారు 100 కోట్ల ఆస్తిని సంపాదించానని… దాన్ని అనుభవించడానికి అతను లేకుండా పోయిందంటూ… తండ్రి లక్ష్మణ కన్నీరుమున్నీరుగా విలపించారు.

Bengaluru Stampede – నా కొడుకు మృతదేహానికి పోస్టుమార్టం చేయొద్దు

నా ఒక్కగానొక్క కొడుకు భూమిక్ ను ఎంతో ముద్దుగా పెంచాను. ఇలాంటి పరిస్థితి ఏ తండ్రికీ రాకూడదు. నా కొడుక్కి పోస్టుమార్టం చేయవద్దు, కోసి ముక్కలు చేయొద్దు అంటూ లక్షణ్ ప్రాధేయపడ్డాడు. సీఎం, డీసీఎం వచ్చి పరామర్శిస్తారు, కానీ నా కుమారుడు రాడంటూ తండ్రి లక్ష్మణ బోరుమన్నాడు. అంబులెన్స్‌ లేని కారణంగా జీపులో భూమిక్‌ మృతదేహాన్ని తీసుకుని వెళ్లారు.

అశ్రునయనాల మధ్య మనోజ్‌ అంత్యక్రియలు

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన తొక్కిసలాటలో(Bengaluru Stampede) మరణించిన మనోజ్‌ (20) అంత్యక్రియలు కుటుంబ సభ్యులు, బంధువుల అశ్రునయనాల మధ్య జిల్లాలోని కుణిగల్‌ తాలూకా ఎడెయూరు సమీపంలోని నాగసంద్ర గ్రామంలోని వారి తోటలో జరిగాయి. అంత్యక్రియల సమయంలో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. బెంగళూరులోని హెబ్బాళ సమీపంలోని కెంపాపుర రెసిడెన్సీ కాలేజీలో బీబీఎం చదువుతున్న మనోజ్‌ యలహంకలో తల్లిదండ్రులు, సోదరితో కలిసి ఉండేవాడు. బుధవారం స్నేహితులతో కలిసి చిన్నస్వామి స్టేడియానికి వెళ్లి అక్కడ జరిగిన తొక్కిసలాటలో మృత్యువాత పడ్డాడు.

తొక్కిసలాట బాధ్యత ప్రభుత్వానిదే – మంత్రి ప్రియాంక ఖర్గే

బెంగుళూరు తొక్కిసలాటకు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహిస్తుందని గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌, ఐటీబీటీ మంత్రి ప్రియాంక ఖర్గే తెలిపారు. బెంగళూరులో విలేకరులతో మాట్లాడుతూ ఈ ఘటన జరగిఉండరాదు, ఎక్కువమంది అభిమానులు రావడంతో జరిగింది. సరైన వ్యవస్థలను కల్పించి ఉంటే ఈ ప్రమాదం జరిగేది కాదన్నారు. ప్రభుత్వం నుంచి లోపం జరిగిన మాట వాస్తవమే, అంగీకరిస్తున్నాం అన్నారు. ఒక ప్లాన్‌ ప్రకారం కార్యక్రమంను నిర్వహించి ఉంటే బాగుండేదని అన్నారు. మంత్రి ప్రకటనను జేడీఎస్‌ ఎక్స్‌లో పోస్టు చేసింది.

Also Read : Kamal Haasan: రాజ్యసభకు నామినేషన్‌ దాఖలు చేసిన కమల్‌ హాసన్‌

Leave A Reply

Your Email Id will not be published!