KTR Trivikram : ప్రీ రిలీజ్ కోసం భీమ్లా నాయ‌క్ సిద్దం 

ముఖ్య అతిథిగా ఐటీ మంత్రి కేటీఆర్ 

Trivikram : సాగ‌ర్ కె. చంద్ర ద‌ర్శ‌క‌త్వంలో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టించిన భీమ్లా నాయ‌క్ పై భారీ అంచ‌నాలు ఉన్నాయి. ఇప్ప‌టికే సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది.

ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే, ర‌చ‌నా స‌హ‌కారం దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ (Trivikram)అందించారు. ఇప్ప‌టికే చిత్రానికి సంబంధించిన పోస్ట‌ర్లు, టీజ‌ర్లు, సాంగ్స్ దుమ్ము రేపాయి.

భీమ్లా నాయ‌క్ ప్రీ రిలీజ్ వేడుక‌ను ఈనెల 21న నిర్వ‌హించ‌నున్నారు మూవీ మేక‌ర్స్. ఈ కార్య‌క్ర‌మానికి చీఫ్ గెస్ట్ గా మంత్రి కేటీఆర్ హాజ‌ర‌వుతారు. ఈ మేర‌కు చిత్ర నిర్మాత సూర్య దేవ‌ర రాధాకృష్ణ , ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ (Trivikram)మంత్రిని క‌లిసి ఆహ్వానించారు.

దిగ్గ‌జ ద‌ర్శ‌కుడిని చూసి కేటీఆర్ సంతోషానికి గుర‌య్యారు. తాను త‌ప్ప‌కుండా వ‌స్తాన‌ని హామీ ఇచ్చారు. త‌మ సినిమా కోసం వ‌స్తున్నందుకు ఈ సంద‌ర్బంగా తాము కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు నిర్మాత నాగ‌వంశీ.

ఆయ‌న భీమ్లా  నాయ‌క్ ను నిర్మిస్తున్నారు. మాట‌లు కూడా ఇప్ప‌టికే పేలాయి . వీటిని త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ రాశారు. ఇక భీమ్లా నాయ‌క్ మ‌ల‌యాళంలో బిగ్ హిట్ అయిన అయ్య‌ప్ప‌కోషియ‌మ్ మూవీకి మాతృక‌.

ప‌వ‌న్ క‌ళ్యాణ్ మేన‌రిజం ఈ సినిమాకు అస్సెట్ కానుంది. ఇక భీమ్లా నాయ‌క్ కు కిన్నెర మొగుల‌య్య అందించిన గొంతు టాప్ లో నిలిచింది. ఆయ‌న‌కు ప‌ద్మ‌శ్రీ కూడా కేంద్రం ప్ర‌క‌టించింది.

అయితే భీమ్లా నాయ‌క్ ను ఈనెల 25న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల కానుంది. ప్రీ రిలీజ్ వేడుక హైద‌రాబాద్ లోని యూసుఫ్ గూడ లో జ‌ర‌గ‌నుంది.

Also Read : మా ఫ్యామిలీ జీర్ణించు కోవ‌డం లేదు

Leave A Reply

Your Email Id will not be published!