K Annamalai Appoints : అన్నామలైకి కీలక బాధ్యతలు
కర్ణాటక ఎన్నికల కో ఇన్ ఛార్జ్ గా
K Annamalai Appoints : భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కీలక ప్రకటన చేశారు. ఈ మేరకు తమిళనాడు స్టేట్ బీజేపీ చీఫ్ , డైనమిక్ లీడర్ గా పేరొందిన మాజీ ఐపీఎస్ ఆఫీసర్ కే. అన్నామలైకి కీలక బాధ్యతలు అప్పగించారు. ఆయన గతంలో కర్ణాటకలో ఎస్పీగా పని చేశారు. ఆ తర్వాత తన పదవికి రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీలో చేరారు.
తమిళనాడులో మోస్ట్ పవర్ ఫుల్ లీడర్ గా ఎదిగారు. ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుంది పార్టీ అధిష్టానవర్గం. ఈ మేరకు ఈ ఏడాదిలోనే కర్ణాటకలో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే భారతీయ జనతా పార్టీ మరోసారి అధికారంలోకి రావాలని ప్లాన్ చేస్తోంది. వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది.
ఎన్నికల ర్యాలీలు, సభలకు శ్రీకారం చుట్టారు బీజేపీలో ట్రబుల్ షూటర్ గా పేరొందిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా. పలుమార్లు పర్యటించారు. పార్టీకి చెందిన శ్రేణులను సమాయత్తం చేస్తున్నారు. ఈ తరుణంలో కర్ణాటక ఎన్నికల ఇన్ ఛార్జ్ లుగా ఇద్దరిని నియమించింది భారతీయ జనతా పార్టీ హై కమాండ్.
ఒకరు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన కాగా మరొకరు తమిళనాడు బీజేపీ స్టేట్ చీఫ్ కే. అన్నామలై(K Annamalai Appoints). ఇప్పటికే కర్ణాటకలో ఎన్నికలను గతంలో పర్యటించారు ధర్మేంద్ర ప్రధాన్. మరోసారి ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించింది పార్టీ. ఇక ప్రధాన్ కు తోడుగా అన్నామలైని నియమించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
Also Read : బీజేపీతో బంధం అన్నాడీఎంకేకు నష్టం