Bomb Threat: ఎయిర్‌ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు ! థాయిలాండ్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ !

Bomb Threat : అహ్మదాబాద్‌ లో జరిగిన ఘోర ఎయిర్‌ ఇండియా విమాన ప్రమాద ఘటన నుంచి ఇంకా తేరుకోనే లేదు. ఇంతలో మరో ఎయిర్‌ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు కాల్‌ రావడం తీవ్ర కలకలం సృష్టించింది. దీనితో అప్రమత్తమైన పైలట్లు ఎయిర్‌ ఇండియా విమానాన్ని థాయిలాండ్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ చేశారు. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే…

Bomb Threat in Air India Flight

థాయ్ లాండ్ లోని పుకెట్‌ నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఎయిర్‌ ఇండియా AI-379 విమానానికి బాంబు బెదిరింపు కాల్‌ వచ్చింది. దీనితో అప్రమత్తమైన అధికారులు థాయిలాండ్‌ లో విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ చేశారు. ఈ విమానంలో 156 మంది ప్రయాణికులు ఉన్నారు. బెదిరింపు కాల్‌ అనంతరం, ప్రయాణికులను విమానం నుంచి కిందకు దింపేసి… విమానంలో తనిఖీలు చేపట్టారు. ప్రస్తుతం ప్రయాణీకులంతా సురక్షితంగా ఉన్నారని ఎయిర్ ఇండియా సంస్థ ప్రకటించింది. అయితే బాంబు బెదిరింపులు ఎక్కడ నుండి వచ్చాయి అనే వివరాలు ఇంకా వెల్లడించలేదు. ఈ నేపథ్యంలో ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Also Read : Tata Chairman: టాటా గ్రూపు ఉద్యోగులకు చైర్మెన్ భావోద్వేగ లేఖ

Leave A Reply

Your Email Id will not be published!