Honeymoon Murder: హనీమూన్ హత్య కేసులో వెలుగులోనికి వస్తున్న సంచలన విషయాలు

హనీమూన్ హత్య కేసులో వెలుగులోనికి వస్తున్న సంచలన విషయాలు

 

 

ఇటీవల పెళ్లి చేసుకుని… భార్యతో కలిసి హనీమూన్ కోసం వెళ్లి హత్యకు గురైన రాజా రఘవంశీ కేసులో ఆసక్తికర విషయాలు వెలుగుచూస్తున్నాయి. ఇండోర్ నివాసి అయిన రఘవంశీ తన భార్య సోనమ్‌ తో కలిసి మేఘాలయకు హనీమూన్‌ కు వచ్చి అనుమానాస్పద స్థితిలో హత్యకు గురయ్యాడు. సోహ్రాలోని ఓ జలపాతం సమీపంలో లోతైన లోయలో అతని శవాన్ని పోలీసులు గుర్తించారు. తాజాగా అతని మృతదాహానికి పోస్టుమార్టం పూర్తయింది. దీనితో రఘువంశీ అనుమానాస్పద మృతి కేసులో ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. అతని తలపై రెండు బలమైన గాయాలు తగిలినట్టు గుర్తించారు. ఒకటి తల ముందు నుంచి, రెండవది వెనుక నుంచి తగిలినట్టు నిర్ధారించారు. గాయాలు లోతుగా తగలడంతో తీవ్రమైన రక్తస్రావం జరిగి మరణించినట్టు పోస్టుమార్టం నివేదక వెల్లడించింది.

మధ్యప్రదేశ్ లోని ఇండోర్ కు చెందిన రఘువంశీ, సోనమ్ దంపతులు మే 20న మేఘాలయకు హనీమూన్ ట్రిప్‌కు వచ్చి ఆ తర్వాత కనిపించకుండా పోయారు. అయితే , మే 22న వీరు ద్విచక్ర వాహనాన్ని అద్దెకు తీసుకుని మౌలికాయత్ అనే గ్రామానికి వచ్చినట్టు అధికారులు గుర్తించారు. ఆ మరుసటి రోజు నుంచి వీరు కనిపించకుండా పోయారు. సుమారు 10 రోజుల తర్వాత రాజా మృతదేహం లోతైన ఒక లోయలో కనిపించింది. సోనమ్ సుపారీ ఇచ్చిన వ్యక్తులు రాజాను చంపినట్టుగా పోలీసులు అనుమానిస్తున్న తరుణంలో సోనమ్ సోమవారంనాడు ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాపూర్‌లో పోలీసులకు లొంగిపోయింది. రాజా మృతదేహం కనిపించిన వారం రోజుల తర్వాత ఆమె లొంగిపోవడంతో కేసు కీలక మలుపు తిరిగింది.

 

కిరాయి వ్యక్తులతో తన భర్తను సోనమ్ చంపించిందని, ఆ కిరాయి మనుషుల్లో ఒకరైన రాజ్ కుష్వహ్‌తో సోనమ్‌కు అఫైర్ ఉందని మేఘాలయ పోలీసుల అనుమానం. కుష్వాహ్‌ తో సహా నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. తక్కిన ముగ్గురిని ఆకాష్ రాజ్‌పుత్, వికాస్ అలియాస్ విక్కీ, ఆనంద్‌గా గుర్తించారు. భర్త హత్యలో సోనమ్ ప్రమేయం ఉన్నట్టు మేఘాలయ డీజీపీ ఇడాశిష నాన్‌గ్రాంగ్ ధ్రువీకరించారు. కిరాయి వ్యక్తులతో తన భర్తను హత్య చేసేందుకు ప్లాన్ చేసిందని, నలుగురు నిందితులను మధ్యప్రదేశ్‌లో అరెస్టు చేశామని చెప్పారు.

 

నా కూతురిని ఇరికించారు – సోనమ్ తండ్రి

 

కాంట్రాక్టు వ్యక్తులతో భర్తను తన కుమార్తే హత్య చేయించిందనే ఆరోపణలను సోనమ్ తండ్రి తోసిపుచ్చారు. మేఘాలయ పోలీసులు ఆమెపై తప్పుడు కేసు బనాయించారని చెప్పారు. కేసును సీబీఐతో దర్యాప్తు జరిపించాలని, ఇందుకోసం తాను మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్, కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను కలుస్తానని అన్నారు. సోనమ్ తనను కిడ్నాప్ చేశారని, దోచుకునేందుకు ప్రయత్నించారని ఫోనులో తెలియజేసినట్టు ఆయన చెప్పారు. ఘజియాబాద్‌కు ఎలా వచ్చానో కూడా తనకు తెలియదని సోనమ్ చెప్పినట్టు వెల్లడించారు.

Leave A Reply

Your Email Id will not be published!