Navjyot Singh Sidhu : భ‌ద్ర‌తా లోపం సిద్దూ ఆగ్ర‌హం

త‌న‌కు సెక్యూరిటీ త‌గ్గింపుపై ఫైర్

Navjyot Singh Sidhu : పంజాబ్ ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ మాజీ చీఫ్ , మాజీ క్రికెట‌ర్ న‌వ‌జ్యోత్ సింగ్ సిద్దూ(Navjyot Singh Sidhu) సీరియ‌స్ కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో శాంతి భ‌ద్ర‌త‌ల‌కు భంగం వాటిల్లింద‌ని ఆరోపించారు. ప్ర‌ధానంగా ముఖ్య‌మైన నేత‌ల‌కు కావాల‌ని సెక్యూరిటీ ఎందుకు త‌గ్గించాల్సి వ‌చ్చిందంటూ మండిప‌డ్డారు. ప్ర‌త్యేకించి సీఎం భ‌గ‌వంత్ మాన్ ను టార్గెట్ చేశారు.

తాజాగా పాటియాలో ఉన్న త‌న ఇంటి వ‌ద్ద భ‌ద్ర‌తా లోపాన్ని ఎత్తి చూపారు. ఈ విష‌యం గురించి ఆయ‌న లేవ‌నెత్తారు. దీంతో పోలీసులు కేసు న‌మోదు చేశారు. త‌న నివాసానికి సంబంధించిన టెర్ర‌స్ పై అనుమానాస్ప‌ద వ్య‌క్తి త‌న శ‌రీరానికి బూడిద రంగు దుప్ప‌టిని క‌ప్పుకుని క‌నిపించిన‌ట్లు చెప్పారు న‌వ జ్యోత్ సింగ్ సిద్దూ(Navjyot Singh Sidhu).

సెక్యూరిటీ గార్డు అలారం వినిపించ‌డంతో అగంత‌కుడు త‌ప్పించుకుని పారిపోయాడ‌ని వెల్ల‌డించారు. త‌న‌కే ర‌క్ష‌ణ లేక పోతే ప్ర‌జ‌ల‌కు ప్ర‌భుత్వం ఎలా ర‌క్ష‌ణ క‌ల్పిస్తుందంటూ ఘాటుగా ప్ర‌శ్నించారు పీసీసీ మాజీ చీఫ్. ఇదిలా ఉండ‌గా సిద్దూ పాటియాలా నివాసంలో చోటు చేసుకున్న భ‌ద్ర‌తా లోపానికి సంబంధించి ఎఫ్ఐఆర్ న‌మోదు చేసిన‌ట్లు సోమ‌వారం వెల్ల‌డించారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు జ‌రుపుతున్న‌ట్లు పోలీసు ఉన్నతాధికారి ఒక‌రు తెలిపారు. ఈ ప్రాంతంలోని సీసీ ఫుటేజీల‌ను ప‌రిశీలిస్తున్న‌ట్లు పేర్కొన్నారు.

Also Read : స్వ‌లింగ సంప‌ర్క వివాహం ప్ర‌మాదం

Leave A Reply

Your Email Id will not be published!