CJI Request : ఆ 9 మంది న్యాయమూర్తుల పదవీకాలం పొడిగింపు కు సిఫార్సు చేసిన సుప్రీం

హైకోర్టు న్యాయమూర్తుల నియామకాలు, పొడిగింపులను నిర్ణయించే బాధ్యతను కలిగి ఉంది...

CJI : భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీం కోర్ట్(Supreme Court) కొలీజియం.. కలకత్తా హైకోర్టులోని పలువురు న్యాయమూర్తుల పదవీ కాలాన్ని పొడగించాలని నిర్ణయించింది. హైకోర్టులో పని చేస్తున్న తొమ్మిది మంది అదనపు న్యాయమూర్తుల పని వేళలను సైతం ఏడాదిపాటు పొడగించాలని సిఫార్సు చేసింది. న్యాయమూర్తులు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బీఆర్ గవాయ్‌లతో కూడిన కొలీజియం.. హైకోర్టు న్యాయమూర్తుల నియామకాలు, పొడిగింపులను నిర్ణయించే బాధ్యతను కలిగి ఉంది. ఏప్రిల్‌లో కలకత్తా హైకోర్టు కొలీజియం న్యాయమూర్తులుగా బిశ్వరూప్ చౌదరి, పార్థ సారథి సేన్, ప్రసేన్‌జిత్ బిస్వాస్, ఉదయ్ కుమార్, అజయ్ కుమార్ గుప్తా, సుప్రతిమ్ భట్టాచార్య, పార్థ సారథి ఛటర్జీ, అపూర్బ సిన్హా రేలను నియమించాలని ఏకగ్రీవంగా సిఫార్సు చేసింది.

CJI Request…

ఏప్రిల్ 29న హైకోర్టు కొలీజియం ఏకగ్రీవంగా తొమ్మిది మంది అదనపు న్యాయమూర్తుల పేర్లను శాశ్వత న్యాయమూర్తులుగా నియమించేందుకు సిఫారసు చేసిందని తీర్మానంలో పేర్కొంది. ఈ సిఫారసుపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, గవర్నర్ సీవీ ఆనంద్ బోస్ తమ అభిప్రాయాలను తెలియజేయలేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

శాశ్వత న్యాయమూర్తులుగా నియమించడానికి అదనపు న్యాయమూర్తుల అనుకూలతను నిర్ధారించడానికి, కలకత్తా హైకోర్టు వ్యవహారాలపై… న్యాయమూర్తులను సంప్రదించినట్లు సుప్రీంకోర్టు కొలీజియం తెలిపింది. అన్ని అంశాలను పరిశీలించిన తరువాత, కొలీజియం ఆగస్టు 31, 2024 నుంచి వచ్చే ఏడాది అదే సమయం వరకు వీరిని కొనసాగించనుంది.

Also Read : USA Order : భారత్ లోని ఆ ప్రాంతాలకు వెళ్లకూడదని హెచ్చరిక

Leave A Reply

Your Email Id will not be published!