Ashok Gehlot : రాజ‌స్థాన్ లో బీజేపీ గెల‌వ‌దు – సీఎం

కాషాయానికి అంత సీన్ లేదు

Ashok Gehlot : రాజ‌స్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. త్వ‌ర‌లో త‌మ రాష్ట్రంలో జ‌రిగే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ బంప‌ర్ మెజారిటీ సాధిస్తుంద‌ని ధీమా వ్య‌క్తం చేశారు. ఆపై రెండోసారి తాము అధికారంలోకి వ‌స్తామ‌ని జోష్యం చెప్పారు సీఎం. గ‌తంలో ఎన్న‌డూ లేనంత‌గా మౌలిక స‌దుపాయాల‌ను ఏర్పాటు చేశామ‌న్నారు. అన్ని వ‌ర్గాల‌కు ల‌బ్ది చేకూరేలా సంక్షేమ ప‌థ‌కాల‌ను, కార్య‌క్ర‌మాల‌ను అమ‌లు చేయ‌డం జ‌రిగింద‌ని చెప్పారు. సీఎం అశోక్ గెహ్లాట్(Ashok Gehlot) శ‌నివారం జాతీయ మీడియాతో ప్ర‌త్యేకంగా మాట్లాడారు.

కులం పేరుతో, మ‌తం పేరుతో, విద్వేషాల‌తో ఎల్ల‌కాలం ప్ర‌జ‌ల‌ను మోసం చేయాల‌ని అనుకోవ‌డం ఒట్టి భ్ర‌మ త‌ప్ప మ‌రొక‌టి కాద‌న్నారు సీఎం. ఎన్నిక‌ల స‌మ‌యంలోనే వాళ్ల‌కు మ‌త‌ప‌ర‌మైన స‌మ‌స్య‌లు గుర్తుకు వ‌స్తాయ‌ని దాని ద్వారా వాళ్లు ల‌బ్ది పొందాల‌ని చూస్తార‌ని ధ్వ‌జ‌మెత్తారు అశోక్ గెహ్లాట్. క‌ర్ణాట‌క‌లో వ్యూహం విఫ‌ల‌మైంద‌ని , ఆ పార్టీకి సంబంధించి ప్ర‌ధాని మోదీ , ట్ర‌బుల్ షూట‌ర్ అమిత్ చంద్ర షా, బీజేపీ చీఫ్ జేపీ న‌డ్డా త్ర‌యం మొత్తం క‌న్న‌డ నాట ఫోక‌స్ పెట్టినా వ‌ర్క‌వుట్ కాలేద‌న్నారు.

ఇవాళ రాష్ట్రంలో మెరుగైన పాల‌న అందించామ‌ని, ఇంత‌కంటే జ‌నం ఎక్కువ ఆశించ‌డం లేద‌ని చెప్పారు అశోక్ గెహ్లాట్. త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీజేపీకి పుట్ట‌గ‌తులు ఉండ‌వ‌న్నారు. కాంగ్రెస్ జెండా ఎగ‌ర‌డం ఖాయ‌మ‌ని ఇందులో ఎలాంటి అనుమానం అక్క‌ర్లేద‌న్నారు రాజ‌స్థాన్ సీఎం.

Also Read : Bhagavanth Kesari Teaser : భ‌గ‌వంత్ కేస‌రి టీజ‌ర్ అదుర్స్

Leave A Reply

Your Email Id will not be published!