CM Bommai Rahul Gandhi : స్కాంలకు కేరాఫ్ కాంగ్రెస్ – బొమ్మై
40 శాతం కమీషన్ సర్కార్ అన్న రాహుల్
CM Bommai Rahul Gandhi : కర్ణాటక సీఎం బస్వరాజ్ బొమ్మై నిప్పులు చెరిగారు. తమ ప్రభుత్వంపై నోరు పారేసుకున్న కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 40 శాతం కమీషన్ సర్కార్ నడుస్తోందంటూ సంచలన ఆరోపణలు చేశారు. దీనిపై తీవ్రంగా స్పందించారు సీఎం బొమ్మై(CM Bommai Rahul Gandhi). ఎవరు అవినీతి పరులో , ఎవరు స్కాంలకు పాల్పడ్డారో ఈ దేశానికి తెలుసన్నారు.
ముందు హయాంలో జరిగిన స్కాంలకు సంబంధించిన ఛార్జిషీట్ కు ఇప్పటి దాకా రాహుల్ గాంధీ సమాధనం ఇవ్వలేదన్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగిన స్కామ్ లపై రాహుల్ కు ఛార్జ్ షీట్ పంపారని, కానీ ఇప్పటి వరకు ఆయన ఆన్సర్ ఇవ్వలేదంటూ ఆరోపించారు సీఎం.
కర్ణాటకలో తమ పార్టీ గెలుస్తుందని రాహుల్ గాంధీ చెప్పడాన్ని తిప్పి కొట్టారు. ప్రజలు తమ వైపు ఉన్నారని, దేశంలో ఎక్కడా లేని రీతిలో కేంద్రం అనేక నిధులు మంజూరు చేసిందన్నారు. తమ హయాంలోనే అభివృద్దిలో రాష్ట్రం ముందంజలో కొనసాగుతోందన్నారు.
ఇప్పటి వరకు ఏ రాష్ట్రానికి ఇవ్వనన్ని నిధులు కేంద్రం కర్ణాటకకు ఇచ్చిందన్నారు. ముందు మీ హయాంలో ఏమేం చేశారో రాష్ట్ర ప్రజలకు చెప్పాలని సీఎం బస్వరాజ్ బొమ్మై(CM Bommai) డిమాండ్ చేశారు. ఇప్పటికే కోర్టు మెట్లు ఎక్కిన రాహుల్ గాంధీ కొంచెం నోరు అదుపులో పెట్టుకుంటే మంచిదని సలహా ఇచ్చారు బొమ్మై.
Also Read : షెట్టర్ చేరికతో కాంగ్రెస్ లో జోష్