CM Chandrababu: ఈ నేల 4లోగా వరద బాధితుల ఖాతాల్లో రూ.602 కోట్ల పరిహారం జమ కావాల్సిందే: సీఎం చంద్రబాబు ఆదేశం

ఈ నేల 4లోగా వరద బాధితుల ఖాతాల్లో రూ.602 కోట్ల పరిహారం జమ కావాల్సిందే: సీఎం చంద్రబాబు ఆదేశం

CM Chandrababu: ముఖ్యమంత్రి చంద్రబాబు సచివాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో వరద బాధితుల ఉద్దేశించి అధికారుల కి ఆదేశాలు జరిచేశారు. శుక్రవారం నాటికి అందరికీ పరిహారం పంపిణీ పూర్తి కావాలని స్పష్టంచేశారు. ఈ సమీక్ష సమావేశంలో మంత్రులు నారాయణ, అనగాని సత్యప్రసాద్, ఉన్నతాధికారులు పాల్గొన్నరు.

CM Chandrababu Announce..

నష్టపోయిన వారిలో ఏ ఒక్కరూ అసంతృప్తితో ఉండటానికి వీల్లేదన్నారు. భారీవర్షాలు, వరదల్లో నష్టపోయిన వారికి ప్రభుత్వం నగదు విడుదల చేసినా.. సాంకేతిక సమస్యలతో 22,185 మంది లబ్ధిదారుల ఖాతాల్లో జమ కాలేదు. సాయం పంపిణీలో సమస్యలు, బాధితుల ఫిర్యాదులపై సోమవారం సచివాలయంలో సీఎం చంద్రబాబు(CM Chandrababu) సమీక్షించి రూ.602 కోట్ల పరిహారం పంపిణీకి సంబంధించి… లబ్ధిదారుల ఖాతాల్లో రూ.588.59 కోట్లు జమయ్యాయి. 97% మంది ఖాతాల్లోకి నగదు చేరింది అని అధికారులు సీఎంకు వివరించారు.

ఖాతా వాడకంలో లేకపోవడం, ఆధార్‌ అనుసంధానం కాకపోవడం, కొన్ని ఖాతాలు క్లోజ్‌ కావడం, ఎకౌంట్‌ నంబరు తప్పుగా నమోదు కావడం, వివరాలు సరిగా లేకపోవడం తదితర సాంకేతిక సమస్యల కారణంగా 22,185 మంది ఖాతాల్లో సాయం జమ కాలేదు. బ్యాంకుకు వెళ్లి కేవైసీని పరిశీలించుకోవాలని వారికి సూచించాం. రెండు, మూడు రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తవుతుంది అని తెలిపారు. ఇప్పటికీ కొంతమంది పరిహారం కోసం దరఖాస్తు చేస్తున్నారని.. వాటిని పరిశీలించి అర్హులైన వారికి సాయం అందిస్తున్నామని సీఎంకు అధికారులు తెలిపారు. ఖాతాల్లో డబ్బు పడని వారు.. సచివాలయ సిబ్బందిని సంప్రదించి సమస్య పరిష్కరించుకోవాలని సూచించామన్నారు. దెబ్బతిన్న వాహనాలకు బీమా చెల్లింపు, రుణాల రీషెడ్యూల్, అర్బన్‌ కంపెనీ ద్వారా ఎలక్ట్రానిక్‌ వస్తువుల మరమ్మతులు తదితర అంశాలపైనా సీఎంకు వివరించారు. మంత్రులు నారాయణ, అనగాని సత్యప్రసాద్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Also Read : Sunita Williams : అంతరిక్షం నుంచి భూమిపైకి ఫిబ్రవరిలో రానున్న సునీతా విలియమ్స్

Leave A Reply

Your Email Id will not be published!