CM Chandrababu: సీఎం చంద్రబాబుతో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ భేటీ

సీఎం చంద్రబాబుతో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ భేటీ

 

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కేంద్ర వాణిజ్య, పరిశ్రమలశాఖ మంత్రి పీయూష్ గోయల్ భేటీ అయ్యారు. ఉండవల్లిలోని సీఎం నివాసంలో జరిగిన ఈ భేటీలో పలు కీలక అంశాలను చర్చించారు. ముఖ్యంగా హెచ్డీ బర్లీ పొగాకు కొనుగోళ్లు, పామాయిల్‌పై దిగుమతి సుంకం తగ్గింపు, ఆక్వా ఎగుమతులు, మ్యాంగో పల్ప్‌పై జీఎస్టీ తగ్గింపుపై ఇరువురు నేతలు చర్చించారు. పొగాకు ధరలు తగ్గ్గినందున రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్నట్టు వెల్లడించారు. బాపట్ల, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో ఏడు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు సీఎం వివరించారు.

పొగాకు కొనుగోళ్లకు రాష్ట్ర ప్రభుత్వం రూ.300 కోట్లు ఖర్చు చేస్తోందని, టొబాకో బోర్డు రూ.150 కోట్లు భరించేలా చూడాలన్నారు. పొగాకు ఉత్పత్తి, మార్కెటింగ్‌ ను టొబాకో బోర్డు నియంత్రించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. సీఎంతో భేటీ అంనతరం పీయూష్‌ గోయల్‌ గుంటూరు వెళ్లారు. గుంటూరు పొగాకుబోర్డ్‌ కార్యాలయంలో అధికారులు, ఎన్‌ఐసీడీసీతో సమావేశం నిర్వహించనున్నారు. పొగాకు కొనుగోళ్లు, రైతుల సమస్యలపై చర్చించనున్నారు.

కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తో సీఎం చంద్రబాబు చర్చించిన అంశాలు ఇవే

హెచ్డీ బర్లీ పొగాకు కొనుగోళ్లు, పామాయిల్‌పై దిగుమతి సుంకం తగ్గింపు, ఆక్వా ఎగుమతులు, మ్యాంగో పల్ప్ పై జీఎస్టీ తగ్గింపుపై చర్చించారు.

టొబాకో బోర్డు ద్వారా ఏపీలో పొగాకు కొనుగోళ్ల నిమిత్తం రూ.150 కోట్లు కేటాయించాలని కేంద్ర మంత్రికి ముఖ్యమంత్రి విన్నవించారు.

పొగాకు ధరలు తగ్గిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వమే రూ.300 కోట్లతో 20 మిలియన్ కేజీలు కొనుగోలు చేస్తున్నట్లు కేంద్ర మంత్రికి సీఎం చంద్రబాబు వివరించారు.

 

బాపట్ల, గుంటూరు, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో ఏడు చోట్ల పొగాకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని సీఎం చంద్రబాబు వివరించారు.

పొగాకు కొనుగోళ్ల నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసే రూ.300 కోట్లలో టొబాకో బోర్డు రూ.150 కోట్లు భరించేలా చూడాలంటూ కేంద్ర మంత్రికి సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.

పొగాకు ఉత్పత్తి, మార్కెటింగ్ వంటి అంశాలను టొబాకో బోర్డు ద్వారా నియంత్రించేలా చట్ట సవరణ చేయాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌ను ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు కోరారు.

ఆయిల్ పామ్ దిగుమతి సుంకాన్ని 10 శాతానికి తగ్గించడంపై పునరాలోచన చేయాలని పీయూష్ గోయల్‌ను చంద్రబాబు కోరారు.

దిగుమతి సుంకం తగ్గించడం వల్ల రాష్ట్రంలోని పామాయిల్ రైతులకు సరైన ధర రావడం లేదని.. తీవ్రంగా నష్టపోతారని కేంద్ర మంత్రికి సీఎం చంద్రబాబు వివరించారు.

దిగుమతి సుంకం తగ్గింపు నిర్ణయం.. కేంద్రం నిర్దేశించిన నేషనల్ మిషన్ ఆన్‌ ఎడిబుల్ ఆయిల్స్ లక్ష్యాలకూ ఇబ్బందికరంగా ఉంటుందనే విషయాన్ని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు గుర్తు చేశారు.

ఆక్వా ఎగుమతులపై అమెరికా విధించిన సుంకాల విషయంలో ఆ దేశంతో చర్చలు జరపాలని సీఎం చంద్రబాబు సూచించారు.

సీఫుడ్‌పై అమెరికా విధించిన 27 శాతం సుంకం ఏపీలోని 8 లక్షల మంది ఆక్వా రైతులపై ప్రభావితం చూపుతోందని సీఎం చంద్రబాబు సోదాహరణగా వివరించారు.

ఏపీ ఆక్వా రైతులపై ఈ భారాన్ని తగ్గించేలా చొరవ తీసుకోవాలని కేంద్రమంత్రికి విన్నవించారు.

మ్యాంగో పల్ప్‌పై జీఎస్టీని 12 నుంచి 5 శాతానికి తగ్గించాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌ని సీఎం చంద్రబాబు కోరారు.

ఇప్పటికే కేంద్ర ఆర్థిక మంత్రి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లినట్టు పీయూష్ గోయల్‌కు సీఎం చంద్రబాబు గుర్తు చేశారు.

Leave A Reply

Your Email Id will not be published!