CM Chandrababu Naidu: వాచ్ మెన్ రంగయ్య మృతిపై సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం

వాచ్ మెన్ రంగయ్య మృతిపై సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం

CM Chandrababu Naidu : మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక సాక్షుల్లో ఒకరైన వాచ్ మెన్ రంగయ్యపై అనుమానాలు వ్యక్తం కావడంతో సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. వివేకా హత్య కేసులో సాక్షులు వరుసగా మృతి చెందడంపై ఆందోళన వ్యక్తం కావడంతో… మిగిలిన సాక్ష్యులకు తగిర రక్షణ కల్పించాలంటూ డీజీపీ హరీష్ కుమార్ గుప్తాను సీఎం చంద్రబాబు ఆదేశించారు. శుక్రవారం సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు.

CM Chandrababu Naidu – ఇంతకీ ఏం జరిగిందంటే ?

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) అధ్యక్షతన శుక్రవారం అమరావతిలో కేబినెట్ సమావేశమైంది. ఈ కేబినెట్ భేటీ దాదాపు రెండు గంటల పాటు సాగింది. అయితే ఈ భేటీ అనంతరం మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి(YS Viveka) హత్య కేసులో కీలక సాక్షుల్లో ఒకరైన రంగన్న మృతిపై సుదీర్ఘ చర్చ జరిగింది. ఈ సమావేశంలో వైఎస్ వివేకా హత్య కేసులో సాక్షులు ఒక్కొక్కరుగా చనిపోతున్న అంశంపై గంటపాటు చర్చ సాగింది. ఆ క్రమంలో రంగయ్య(Watchman Rangayya) మృతి వెనుక ఉన్న సందేహాలను మంత్రులకు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా వివరించారు. వైఎస్ వివేకా హత్యను తొలుత గుండెపోటుగా చిత్రీకరించినట్లే… వైసీపీకి చెందిన మీడియాలో వాచ్‌మెన్ రంగయ్యను పోలీసులే చంపారంటూ తొలుత ప్రసారం కావడంపై కేబినెట్‌లోని పలువురు మంత్రులు సందేహం వ్యక్తం చేశారు. ఆ వెంటనే సీఎం నారా చంద్రబాబు నాయుడు స్పందిస్తూ… వైఎస్ జగన్ కుట్రల పట్ల అప్రమత్తంగా ఉండాలంటూ తాను పదే పదే చెబుతూ వస్తున్నానని వాళ్లకు వివరించారు.

టీడీపీ నాయకుడు, మాజీ మంత్రి పరిటాల రవి హత్య కేసులో సాక్షులు సైతం ఇలానే చనిపోతూ వచ్చారనే విషయాన్ని సీఎం చంద్రబాబు నాయుడు ఈ సందర్బంగా వారికి సోదాహరణగా వివరించారు. దీనితో వాచ్ మెన్ రంగయ్య మృతి సైతం ముమ్మాటికీ అనుమానాస్పదమేనని సీఎం చంద్రబాబు నాయుడు కరాఖండిగా చెప్పారు. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా సైతం వెంటనే జోక్యం చేసుకుని… ఇది అనుమానాస్పద మృతేనని పోలీసుల విచారణలోనూ నిర్ధారణ అయిందని వెల్లడించారు. ఇప్పటి వరకు ఈ కేసులో ఆరుగురు సాక్షులు చనిపోయారన్నారు. ఈ ఆరుగురు సాక్షులు వరుసగా చనిపోవడం ఎక్కడ జరగలేదని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో ప్రజల్లో అనేక అనుమానాలు వస్తున్నాయని చెప్పారు. వివేకానంద రెడ్డి హత్య జరిగిన నాటి నుంచి చోటు చేసుకున్న ఘటనలన్ని డీజీపీ ఒకసారి వివరించారు. ఏ దురుద్దేశం లేకుంటే సాక్షి మీడియాలో రంగన్న మృతిని పోలీసులకు ఆపాదించాలని ఎందుకు చూస్తారంటూ గట్టి చర్చ జరిగింది.

రంగన్నను హత్య చేసి అది కూడా ప్రభుత్వానికి ఆపాదించాలనే కుట్ర ఇందులో దాగి వుందని మంత్రివర్గంలో వ్యక్తమైంది. అలాగే ఈ హత్య కేసులో కీలక సాక్షిగా ఉన్న దస్తగిరికి వచ్చిన బెదిరింపులపై సైతం ఈ చర్చ జరిగింది. ఈ హత్య కేసులో ఉన్న అనుమానాలతో కేసును ఎలా ముందుకు తీసుకెళ్లాలనే అంశంపై చర్చించారు. సాక్షులు అనుమానాస్పద రీతిలో మృ‌తి చెందడం దురదృష్టకరమని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. ఇక ఈ కేసు సీబీఐ పరిధిలో ఉందని… ఈ నేపథ్యంలో సాక్షులను రక్షించాల్సిన బాధ్యత మనపై ఉందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

Also Read : Konidela Nagababu: ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన నాగబాబు

Leave A Reply

Your Email Id will not be published!