Congress Appoints : రాజ్య‌స‌భ డిప్యూటీ లీడ‌ర్ గా తివారీ

విప్ గా ర‌జ‌నీ పాటిల్ నియామ‌కం

Congress Appoints : కాంగ్రెస్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఈ మేర‌కు రాజ్య‌స‌భ డిప్యూటీ లీడ‌ర్ గా ప్ర‌మోద్ తివారీని నియ‌మించింది. ఆయ‌న‌తో పాటు విప్ గా ర‌జ‌నీ పాటిల్ ను ఎంపిక చేసిన‌ట్లు కాంగ్రెస్ పార్టీ(Congress Appoints) వెల్ల‌డించింది. ఇదిలా ఉండ‌గా ప్ర‌మోద్ తివారీ మూడు సార్లు రాజ్య‌స‌భ స‌భ్యుడిగా ఉన్నారు. ఉత్త‌ర ప్ర‌దేశ్ మాజీ మంత్రిగా ఉన్నారు. ప్ర‌మోద్ తివారీ 2022 వ‌ర‌కు డిప్యూటీ లీడ‌ర్ గా కొన‌సాగారు ఆనంద్ శ‌ర్మ‌. ఆ పోస్ట్ అప్ప‌టి నుంచి ఖాళీగా ఉంది. ర‌జ‌నీ పాటిల్ కూడా కీల‌క‌మైన నాయ‌కుడిగా కొన‌సాగుతూ వ‌చ్చారు.

తాజాగా ఈ కొత్త నియామ‌కాల గురించి కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కుడు జైరాం ర‌మేష్ ట్విట్ట‌ర్ ద్వారా ప్ర‌క‌టించారు. 2013లో రాజ్య‌స‌భ స‌భ్యుడిగా 3 సార్లు సీనియ‌ర్ సభ్యుడు అయిన సిట్టంగ్ స‌భ్యుడు ర‌షీద్ మ‌సూద్ అన‌ర్హ‌త వేటు కార‌ణంగా ఖాళీగా ఉన్న స్థానానికి జ‌రిగిన ఉప ఎన్నిక‌ల్లో తివారీ రాజ్య‌స‌భ స‌భ్యుడిగా ఎన్నిక‌య్యారు.

స‌భ‌లో స‌మావేశాల‌కు అంత‌రాయాల‌కు పాల్ప‌డినందుకు బ‌డ్జెట్ స‌మావేశాల‌కు దూరంగా ఉంచారు చైర్మ‌న్. రెండుసార్లు ఎంపీ అయిన పాటిల్ , మేలో రాజీవ్ మ‌ర‌ణించిన‌ప్ప‌టి నుండి ఖాళీగా ఉన్న ఎగువ స‌భ‌లో కాంగ్రెస్ విప్ పాత్ర‌ను పోషిస్తారు.

ర‌జ‌నీ గ‌తంలో 11వ లోక్ స‌భ‌లో బీడ్ నుంచి లోక్ స‌భ‌కు ఎన్నిక‌య్యారు. న్యూయార్క్ లోని యుఎన్ ప్ర‌ధాన కార్యాల‌యంలో మ‌హిళ‌ల స్థితిగ‌తుల‌పై జ‌రిగిన యుఎన్ క‌మిష‌న్ 49వ సెష‌న్ లో కూడా భార‌త దేశం త‌ర‌పున ప్రాతినిధ్యం వ‌హించారు.

Also Read : న్యాయ వ్య‌వ‌స్థ‌కు టెక్నాల‌జీ అవ‌స‌రం

Leave A Reply

Your Email Id will not be published!