Congress: కాంగ్రెస్‌ పార్టీ నుంచి దిగ్విజయ్‌ సోదరుడు లక్ష్మణ్‌ సింగ్‌ బహిష్కరణ

కాంగ్రెస్‌ పార్టీ నుంచి దిగ్విజయ్‌ సోదరుడు లక్ష్మణ్‌ సింగ్‌ బహిష్కరణ

Congress: మధ్యప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ కీలక నేత దిగ్విజయ్‌ సింగ్‌ తమ్ముడు లక్ష్మణ్‌ సింగ్‌ను పార్టీ నుంచి ఆరేళ్లపాటు బహిష్కరించారు. అగ్రనేత రాహుల్‌ గాంధీపై అతడు చేసిన వ్యాఖ్యల కారణంగానే ఈ నిర్ణయం తీసుకొన్నట్లు పార్టీ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ఆయన కాంగ్రెస్‌ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందున తక్షణమే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని వెల్లడించింది.

కాగా లక్ష్మణ్‌ సింగ్ ఐదు సార్లు ఎంపీగా, మూడు సార్లు ఎమ్మెల్యేగా ఆయన పనిచేశారు. ఇటీవల ఆయన పార్టీ నాయకత్వంపై తరచూ విమర్శలు చేశారు. దీంతో ఆయనకు ఇటీవలే షోకాజ్‌ నోటీసును జారీ చేశారు. ఆయనపై సస్పెన్షన్‌పై ఆల్‌ఇండియా కాంగ్రెస్‌(Congress) కమిటీలోని క్రమశిక్షణా సంఘం నిర్ణయం తీసుకొంది.

Congress – అసలేం జరిగిందంటే ?

ఏప్రిల్‌ 24న పహల్గాం బాధితులకు నివాళి అర్పించే సమయంలో లక్ష్మణ్‌ సింగ్‌ మాట్లాడుతూ… ‘‘ రాహుల్‌ గాంధీ, రాబర్ట్‌ వాద్ర పరిపక్వత లేని నాయకులు. వారి అపరిపక్వత వైఖరితో తలెత్తే పరిణామాలను దేశం అనుభవిస్తోంది. రాబర్ట్‌ వాద్రా స్వయంగా రాహుల్‌గాంధీ బావ. ఓ వర్గాన్ని రోడ్లపై ప్రార్థనలు చేయనీయకపోవడంతోనే ఈ దాడి జరిగిందని అంటారు. ఇలాంటి పిల్లతనాన్ని ఎప్పటి వరకు భరిస్తాం. రాహుల్‌ లోక్‌సభ ప్రతిపక్ష నేత… ఆయన మాట్లాడే ముందు ఆలోచించాలి. జమ్మూకశ్మీర్‌ ముఖ్యమంత్రి ఉగ్రవాదులతో కుమ్మక్కయ్యారు’’ అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ క్రమశిక్షణ సంఘం కార్యదర్శి తారిక్‌ అన్వర్‌ నోటీసులు జారీ చేశారు. ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ సహా పార్టీ సీనియర్‌ నాయకత్వంపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసి అన్ని ఆయన హద్దులు దాటారని దానిలో పేర్కొన్నారు.

Also Read : Ramdevpir Festival: రామ్‌దేవ్‌పీర్ కార్నివాల్‌ లో విషాదం ! స్తంభం కూలి ఒకరు మృతి !

Leave A Reply

Your Email Id will not be published!