Drugs : విజయవాడలో మరోసారి డ్రగ్స్ కలకలం సృష్టించాయి. విజయవాడ నగరంలో పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో భారీగా డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ డ్రగ్స్(Drugs) తరలిస్తున్న ముఠాను విజయవాడ పటమట పోలీసులు అరెస్టు చేశారు. తిరుమలశెట్టి జీవన్ కుమార్, నితీష్ కుమార్, ప్రసాద్ అనే ముగ్గురు నిందితులను అరెస్టు చేయడంతో పాటు రూ. 2లక్షల విలువ చేసే 33 గ్రాముల MDMA డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగావిజయవాడ డీసీపీ సరిత మీడియాకు వివరాలు వెల్లడించారు.
Drugs Gang Arrested
మాదక ద్రవ్యాల రవాణాపై ఏపీ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోందని విజయవాడ(Vijayawada) డీసీపీ సరిత స్పష్టం చేసారు. ఎప్పటికప్పుడు తనిఖీలు చేయడంతో పాటు డ్రగ్స్ అక్రమ రవాణా నిరోధించే చర్యలు చేపట్టామని అన్నారు. వాహనాలు తనిఖీ చేస్తుండగా MDMA డ్రగ్స్ దొరికాయని చెప్పారు. ఈ డ్రగ్స్ తీసుకొవడంతో అతిగా ప్రవర్తిస్తారని అన్నారు. వాహనాల తనిఖీ సమయంలో ముగ్గురు వ్యక్తులు డ్రగ్స్ తీసుకెళ్తున్నట్లు గుర్తించామని విజయవాడ డీసీపీ సరిత తెలిపారు. ఏసీపీ దామోదర్, సీఐ పవన్ కిషోర్లు నిందితులను విచారణ చేసి అరెస్టు చేశారని విజయవాడ డీసీపీ సరిత వెల్లడించారు.
తిరుమలశెట్టి జీవన్ కుమార్, నితీష్ కుమార్, ప్రసాద్లను అరెస్టు చేశామని వివరించారు. 33 గ్రాముల డ్రగ్స్ను నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. యూనివర్శిటీలో విద్యార్థులకు ఈ డ్రగ్స్ అమ్ముతున్నట్లు విచారణలో తేలిందని అన్నారు. ఈ తరహా డ్రగ్స్, గంజాయి ఎక్కడ నుంచి తెస్తున్నారు, ఎక్కడకు చేర్చుతున్నారనే అంశాలపై దృష్టి పెట్టామని చెప్పారు. ఈరోజు దొరికిన MDMA డ్రగ్స్(Drugs) కొరియర్లో ప్యాక్ చేసి పంపారని అన్నారు.
అది పైకి ప్యాకెట్ లాగానే ఉంటుందని.. లోపల చూస్తే డ్రగ్స్ ఉన్నట్లు అర్ధం అవుతోందని తెలిపారు. ఇలాంటి డ్రగ్స్ రవాణా చేసినా, సేవించినా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. గంజాయి రవాణాపై ఇప్పటికే పీడీ యాక్ట్ కేసులు పెట్టామని అన్నారు. ఇప్పుడు కొత్తగా క్విట్ అండ్ పీటీ యాక్ట్ అమల్లోకి వచ్చిందని చెప్పారు. NDPTS కింద నిందితులపై పలు కేసులు నమోదయ్యాయన్నారు. బైక్ దొంగతనాలు చేసి, వాటి ద్వారా గంజాయి రవాణా చేస్తున్నారని తెలిపారు. బైక్లు చోరీకి గురైనా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు విజయవాడ డీసీపీ సరిత.
లాసెట్ ప్రవేశ పరీక్షకు హాజరైన ఏబీ వెంకటేశ్వరరావు
విశ్రాంత ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు లాసెట్ ప్రవేశ పరీక్షకు హాజరయ్యారు. ఒంగోలులోని రైజ్ ఇన్స్టిట్యూట్కు ఆయన పరీక్ష రాసేందుకు వచ్చారు. ఏబీ వెంకటేశ్వరరావు గతంలో వైసీపీ ప్రభుత్వ కక్ష సాధింపులకు గురయ్యారు. ఆ ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో అనేక తప్పుడు అభియోగాలు, అక్రమ సస్పెన్షన్లు ఎదుర్కొన్నారు. 2020 ఫిబ్రవరి 8 నుంచి 2022 ఫిబ్రవరి 7 వరకూ, 2022 జూన్ 28 నుంచి 2024 మే 30 వరకూ మొత్తంగా రెండు విడతల్లో దాదాపు నాలుగేళ్ల పాటు ఆయన సస్పెన్షన్లో ఉన్నారు. అయితే చివరకు ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్ హోదాలో పదవీ విరమణ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నాలుగేళ్ల సస్పెన్షన్ కాలవ్యవధి మొత్తాన్ని క్రమబద్ధీకరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
Also Read : MLA Maganti Gopinath : అత్యంత విషమంగా ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆరోగ్యం