Etela Rajender: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఈటల రాజేందర్ ?

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఈటల రాజేందర్ ?

Etela Rajender: తెలంగాణకు చెందిన కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌ లకు కేంద్ర మంత్రివర్గంలో స్థానం దక్కడంతో రాష్ట్ర పార్టీలో కూడా బీజేపీ జాతీయ నాయకత్వం కీలక మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది. కిషన్‌రెడ్డి ఇప్పటికే రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. బీజేపీలో ఒకరికి రెండు పదవులు అనేది చాలా తక్కువ సందర్భాల్లోనే ఉంటుందని, కిషన్‌రెడ్డి స్థానంలో పార్టీకి కొత్త అధ్యక్షుడిని నియమించవచ్చని తెలుస్తోంది.

Etela Rajender…

ఈ పదవిలో మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌ ను నియమించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. కొత్త పేర్లు కూడా పరిశీలించే వీలుందని పలువురు నేతలు విశ్లేషిస్తున్నారు. బండి సంజయ్‌ ఇప్పటికే జాతీయ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తుండటం… తాజాగా కేంద్ర మంత్రి అయిన నేపథ్యంలో ఒక పదవికే పరిమితం చేస్తారని చర్చ నడుస్తోంది. మరోవైపు అమిత్‌ షాను ఈటల రాజేందర్‌ కలిశారు. కేంద్ర మంత్రిగా ప్రమాణం చేసిన ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. తాజా పరిణామాల నేపథ్యంలో వీరి భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది.

Also Read : Cabinet Ministers List: కొలువుతీరిన కేంద్ర మంత్రి వర్గం ! మంత్రులకు కేటాయించిన శాఖలు ఇవే !

Leave A Reply

Your Email Id will not be published!