బాలిక‌ల‌కు ఉచితంగా శానిట‌రీ న్యాప్కిన్ల పంపిణీ

శాసన మండలిలో మంత్రి నారా లోకేష్ వెల్ల‌డి

అమరావతి : రాష్ట్రంలో 7వ తరగతి నుంచి 12వ తరగతి బాలికలకు ఉచితంగా శానిటరీ న్యాప్ కిన్ లను పంపిణీ చేయడం జరుగుతోందని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలలోని విద్యార్థులకు ఉచితంగా శానిటరీ న్యాప్ కిన్ లను అందించడంపై శాసన మండలిలో సభ్యులు కావలి గ్రీష్మ అడిగిన ప్రశ్నకు మంత్రి లోకేష్ సమాధానం ఇచ్చారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో 7వ తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు చదువుతున్న బాలికలకు ఉచితంగా శానిటరీ న్యాప్ కిన్ లను సరఫరా చేయడం జరుగుతోందన్నారు. గతంలో ఏడు రెగ్యులర్ సైజ్, మూడు లార్జ్ సైజ్ న్యాప్ కిన్ లు ఇచ్చేవారని తెలిపారు. ఫీడ్ బ్యాక్ తీసుకున్న తర్వాత 5 రెగ్యులర్ సైజ్, 5 లార్జ్ సైజ్ శానిటరీ ప్యాడ్ ను ప్రభుత్వం అందజేస్తోంద‌ని చెప్పారు నారా లోకేష్‌.

గత ప్రభుత్వంలో 18.96 కోట్ల బకాయిలు పెట్టారని ఆరోపించారు. ప్రజా ప్రభుత్వం ఆ బకాయిలను తీర్చడం జరిగిందన్నారు. ఆర్టీజీఎస్ నుంచి ఐవీఆర్ఎస్ ద్వారా ఫోన్ కాల్స్ చేసి ఫీడ్ బ్యాక్ తీసుకోవడం జరుగుతోంద‌ని తెలిపారు. 96 శాతం బాలిలకు తమకు శానిటరీ న్యాప్ కిన్ లు అందుతున్నాయని, 4 శాతం మంది అందడం లేదని చెప్పార‌న్నారు. నాణ్యత విషయంలో 1 శాతం బాగా లేదని, 14 శాతం పర్వాలేదు, బాగుందని 85 శాతం మంది చెప్పారన్నారు. శానిటరీ న్యాప్ కిన్స్ ఎబ్సార్ ప్షన్ పై 84 శాతం మంది బాగుందని, 14 శాతం మంది పర్వాలేదని, బాగాలేదని 2 శాతం మంది ఫీడ్ బ్యాక్ ఇచ్చారని తెలిపారు. సైజ్ విషయంలో 89 శాతం మంది బాగుందని, 11 శాతం బాగాలేదని చెప్పారు.

ఎకో ఫ్రెండ్లీ శానిటరీ ప్యాడ్స్ పంపిణీపైనా చర్చించడం జరిగిందన్నారు. దీనిపైనా పరిశీలన చేస్తామ‌న్నారు. ఎన్జీవోలతో మాట్లాడి బాలికల్లో అవగాహన పెంచేందుకు కూడా చర్యలు తీసుకుంటామని తెలిపారు నారా లోకేష్‌. వెండింగ్ మిషన్స్ విత్ స్మార్ట్ కార్డ్ ను ఇప్పటికే కేజీబీవీల్లో పైలట్ ప్రాజెక్ట్ చేపట్టామ‌న్నారు. అన్ని పాఠశాలలకు విస్తరించేందుకు చర్యలు తీసుకుంటామ‌ని తెలిపారు. హెచ్ పీవీ వ్యాక్సిన్ ను ప్రధాని నరేంద్ర మోదీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని చెప్పారు. ఇదో క్యాంపెయిల్ లా చేస్తామ‌ని, దీనిపై అనేక అపోహలు ఉన్నాయని, అందరం కలిసికట్టుగా దీనిపై అవగాహన తీసుకు రావాల్సిన అవసరం ఉందని మంత్రి చెప్పారు.

Leave A Reply

Your Email Id will not be published!