Gajendra singh Shekhawat: 56 ఏళ్ల వయసులో స్కై డైవింగ్ చేసిన కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ !

56 ఏళ్ల వయసులో స్కై డైవింగ్ చేసిన కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ !

Gajendra singh Shekhawat: వరల్డ్ స్కై డైవింగ్‌ సందర్భంగా కేంద్ర పర్యటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌ అరుదైన సాహసం చేశారు. 56 ఏళ్ల వయసులో ఆయన స్కై డైవింగ్ చేశారు. భారత దేశంలో ప్రైవేటు రంగంలో మొట్టమొదటి స్కై డైవింగ్ కేంద్రాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆయన ఈ స్కై డైవింగ్ చేసినట్లు తెలుస్తోంది.

Gajendra singh Shekhawat…

ఈ సందర్భంగా కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ మీడియాతో మాట్లాడుతూ… భారత్‌తో పాటు ఈ ప్రపంచానికి ఈ రోజు అతిముఖ్యమైనది. హరియాణాలోని నార్నౌల్‌ లో ఈ స్కై డైవింగ్ కేంద్రం ఏర్పాటైంది. దేశ పర్యటక శాఖ మంత్రిగా ప్రజలకు ఈ తరహా సదుపాయాలు అందుబాటులో ఉంచడం నా బాధ్యత అని అన్నారు. అనంతరం తాను స్కై డైవింగ్ చేసిన ఫోటోలను తన సోషల్ మీడియా ఎక్స్(ట్విటర్) వేదికగా షేర్ చేశారు. ‘‘ఆ థ్రిల్‌ను నేనూ ఎంజాయ్‌ చేశాను. భారత పర్యటక రంగం అంతర్జాతీయ వసతులను పొందుతున్నందుకు సంతోషంగా ఉంది’’ అంటూ పోస్టు పెట్టారు.

Also Read : MP Kangana Ranaut : ఆధార్ ఉంటేనే అపాయింట్మెంట్ అంటున్న కంగనా

Leave A Reply

Your Email Id will not be published!