Ghulam Nabi Azad : గులాం నబీ ఆజాద్ కు అస్వస్థత ! రియాద్ ఆసుపత్రిలో చేరిక !
గులాం నబీ ఆజాద్ కు అస్వస్థత ! రియాద్ ఆసుపత్రిలో చేరిక !
Ghulam Nabi Azad : జమ్ము కశ్మీర్ మాజీ సీఎం, డెమోక్రటిక్ ప్రోగ్రసీవ్ ఆజాద్ పార్టీ చీఫ్, మాజీ ఎంపీ గులాం నబీ ఆజాద్ అస్వస్థతకు గురయ్యారు. ఎంపీ బృందంతో సౌదీ పర్యటనలో ఉన్న ఆజాద్ అస్వస్థతకు గురి కావడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు బీజేపీ ఎంపీ జయంత్ పాండా వెల్లడించారు. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే… ఉగ్రవాదంతో అంటకాగుతూ మన దేశంపై విషం చిమ్ముతున్న పాకిస్తాన్ను ఎండగట్టేందుకు వివిధ పార్టీల ఎంపీల నాయకత్వంలోని బృందాలు ప్రపంచదేశాలకు వెళ్లాయి. బీజేపీ నేత బైజయంతి పాండా నేతృత్వంలోని బృందం బహ్రెయిన్ లో పర్యటిస్తోంది. ఇందులో భాగంగా బృంద సభ్యుల్లో గులాం నబీ ఆజాద్(Ghulam Nabi Azad) కూడా ఉన్నారు.
Ghulam Nabi Azad Health Updates
ఈ నేపథ్యంలో ప్రస్తుతం సౌదీలో పర్యటిస్తున్న ఆజాద్(Ghulam Nabi Azad) అస్వస్థతకు గురయ్యారు. దీనితో వెంటనే ఆయన్ను రియాద్ లోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ మేరకు బీజేపీ ఎంపీ బైజయంతి పాండా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ఈ క్రమంలో ఆజాద్ ఆరోగ్యం… ఇప్పుడు స్థిరంగా ఉంది. ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. కొన్ని టెస్టులు చేయాల్సి ఉంది. సౌదీ పర్యటనలో ఉండగా ఆయన అనారోగ్యనికి గురి కావడం మమ్మల్ని తీవ్రంగా కలిచివేసింది. ఆయన సహాకారంతో ఇప్పటి వరకు బహ్రెయిన్, కువైట్లలో జరిగిన పర్యటనలు పూర్తిగా ఫలవంతమయ్యాయి. అల్జీరియా పర్యటనలో ఆయన లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది’ అని చెప్పుకొచ్చారు.
పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్ తీరును ప్రపంచ దేశాల ఎదుట ఎండగట్టే ప్రయత్నాన్ని భారత్ చేపట్టింది. అందులోభాగంగా వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ఎంపీలతో ఏడు బృందాలను కేంద్రం ఏర్పాటు చేసింది. ఆయా బృందాలు వివిధ దేశాల్లో పర్యటిస్తున్నాయి. అందులోభాగంగా బీజేపీ ఎంపీ బైజయంతి పాండా నేతృత్వంలోని ఓ బృందం సౌదీలో పర్యటిస్తుంది. ఆ బృందంలో గులాం నబీ ఆజాద్ కూడా ఉన్నారు. ఇప్పటికే సౌదీలోని పలు ప్రాంతాలను ఈ బృందం పర్యటించిన విషయం విదితమే.
ఇక పర్యటనలో భాగంగా పాకిస్థాన్ పై గులాం నబీ ఆజాద్ పదునైన విమర్శలు చేశారు. ప్రపంచ వ్యాప్తంగా నివసిస్తున్న ఉగ్రవాదుల కంటే… పాకిస్థాన్లో అత్యధికంగా ఉగ్రవాదులు నివసిస్తున్నారని తెలిపారు. భారత్ లో ఉద్రిక్తతలు సృష్టించేందుకు పాకిస్థాన్ ప్రయత్నాలు చేస్తుందని విమర్శించారు. ఉగ్రవాదంపై పాకిస్థాన్ తప్పుడు సమాాచారాన్ని వ్యాప్తి చేస్తుందని మండిపడ్డారు. ఇదే ఆ దేశపు నైజమన్నారు. తమ ఈ పర్యటన వల్ల పాక్ ప్రచారం పూర్తి అవాస్తమని అందరికి స్పష్టమైందన్నారు.
Also Read : Speaker Appavu: సీఎం స్టాలిన్ పై స్పీకర్ అప్పావు ఆశక్తికరమైన వ్యాఖ్యలు