Amaravati: అమరావతిలో క్వాంటం వ్యాలీ ఎంవోయూను ర్యాటిఫై చేస్తూ ఉత్తర్వులు
అమరావతిలో క్వాంటం వ్యాలీ ఎంవోయూను ర్యాటిఫై చేస్తూ ఉత్తర్వులు
Amaravati : అమరావతిలో క్వాంటం వ్యాలీ పార్క్ ఏర్పాటుపై ఏపీ ఐటీ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. క్యాంటం వ్యాలీ టెక్నాలజీ పార్క్ ఎంవోయూను ర్యాటిఫై చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. దీని నిర్మాణానికి మూడు సంస్థలతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. టీసీఎస్, ఎల్అండ్టీ, ఐబీఎం సంస్థలు దీన్ని నిర్మించనున్నాయి. క్వాంటం పార్క్లో ఐబీఎం… 156 క్యూబిట్ క్వాంటం సిస్టం-2ను ఏర్పాటు చేయనుంది. టీసీఎస్ క్వాంటం కంప్యూటింగ్ సర్వీసెస్, సొల్యూషన్స్ సేవలు, క్వాంటంపై పరిశోధన, హైబ్రిడ్ కంప్యూటింగ్ స్ట్రాటజీస్ అందించనుంది. క్లెంట్ నెట్వర్క్, స్టార్టప్ల నిర్వహణకు ఇంజినీరింగ్ నైపుణ్యాలను ఎల్అండ్టీ అందించనుంది. 2026 జనవరి 1 నాటికి క్వాంటం వ్యాలీ టెక్నాలజీ పార్క్ సిద్ధం కానుంది.
Amaravati – అమరావతిలో క్వాంటమ్ పార్కు ఎంఓయూ ఖరారు
అమరావతిలో(Amaravati) క్వాంటమ్ వ్యాలీ టెక్నలాజికల్ పార్కు (టెక్ పార్క్) ఏర్పాటుకు ఐబీఎం, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), ఎల్ అండ్ టీ సంస్థలతో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందాన్ని (ఎంఓయూ) ఖరారు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దేశంలోనే మొదటి క్వాంటమ్ కంప్యూటింగ్ హబ్ను అమరావతిలో(Amaravati) ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. 2026 జనవరి 1న దీన్ని ప్రాంభించనున్నట్లు ప్రకటించింది. ఆయా సంస్థలతో ఒప్పందం కుదుర్చుకోవడం ద్వారా రాష్ట్రంలో క్వాంటమ్ పర్యావరణ వ్యవస్థ ఏర్పాటుకు అవకాశం ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది.
ఎంఓయూ లో ఏముందంటే
ఐబీఎం సంస్థ అడ్వాన్స్డ్ క్వాంటమ్ కంప్యూటింగ్కు సంబంధించిన మౌలిక సదుపాయాలను క్వాంటమ్ వ్యాలీ టెక్ పార్కులో కల్పిస్తుంది. అత్యంత శక్తిమంతమైన ఐబీఎం 156 క్యూబిట్ ‘క్వాంటమ్ సిస్టం టూ’ను అందుబాటులోకి తెస్తుంది. దీనివల్ల క్వాంటమ్ నైపుణ్యం, పరిశోధన సహకారం, విద్యా వనరులు పొందేందుకు వీలుంటుంది.
టీసీఎస్తో ఒప్పందం ద్వారా.. సమగ్ర క్వాంటమ్ కంప్యూటింగ్ సేవలు, పరిష్కార సేవలకు సహకారం అందుతుంది. క్వాంటమ్ సామర్థ్యాలను క్లాసికల్ కంప్యూటింగ్ వ్యవస్థలతో అనుసంధానించడానికి టీసీఎస్ తన విస్తృత పరిశోధన, నెట్వర్క్, హైబ్రిడ్ కంప్యూటింగ్ వ్యూహాలను ఉపయోగిస్తుంది. ఆరోగ్య సంరక్షణ, ఆర్థిక, తయారీ రంగాలతో సహా వివిధ ఆవిష్కరణలు, ప్రజావసరాలకు అనుగుణంగా క్వాంటమ్ ఎనేబుల్డ్ అప్లికేషన్లు అభివృద్ధి చేస్తుంది. క్వాంటమ్ కంప్యూటింగ్ రంగంలో శిక్షణ, విద్యా సహకారం అందిస్తుంది.
ఎల్అండ్టీతో ఒప్పందం ద్వారా.. ఆ సంస్థ ప్రాజెక్టు ఇంజినీరింగ్ నైపుణ్యం, నిర్వహణపై దృష్టి పెడుతుంది. ఈ రంగంలో కొత్త స్టార్టప్లు తీసుకురావడానికి విస్తృతమైన నెట్వర్క్ను వినియోగించుకొనే అవకాశం ఉంటుంది.
Also Read : Harish Rao: బీఆర్ఎస్ ను వీడిన నేతలను వ్యక్తిగతంగా ఎప్పుడూ కలవలేదు – హరీశ్రావు