GVMC Mayor: విశాఖ మేయర్‌ పై అవిశ్వాసం నెగ్గిన కూటమి

విశాఖ మేయర్‌ పై అవిశ్వాసం నెగ్గిన కూటమి

GVMC Mayor : మహా విశాఖ నగర పాలక సంస్థ మేయ(GVMC Mayor)ర్‌ గొలగాని హరి వెంకట కుమారిపై టీడీపీ నేతృత్వంలోని జనసేన, బీజేపీ ‘కూటమి’ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. ఈ ఉదయం 11 గంటలకు జీవీఎంసీ(GVMC) ఇన్‌ ఛార్జ్‌ కమిషనర్, కలెక్టర్‌ ఎంఎన్‌.హరేంధిరప్రసాద్‌ అధ్యక్షతన కౌన్సిల్‌ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి ఎక్స్‌అఫీషియో సభ్యులతో కలిపి 74 మంది కూటమి సభ్యులు హాజరయ్యారు. హెడ్‌ కౌంట్ అనంతరం అందరి వద్ద సంతకాలు తీసుకున్నాక ఓటింగ్ జరిగింది. ఓటింగ్‌ లో 74 మంది సభ్యుల బలంతో కూటమి విజయం సాధించింది. వీరంతా అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా ఓటు వేయగా… కౌన్సిల్‌ సమావేశాన్ని వైసీపీ సభ్యులు బహిష్కరించారు. దీనితో మేయర్‌ గొలగాని హరి వెంకట కుమారి పదవిని కోల్పోయారు.

అయితే కూటమికు మద్దత్తుగా 74 మంది మెజార్టీ ఉండగా… ఆఖరి నిమిషంలో ఒకరు జారుకోవడంతో కూటమి నేతల్లో ఆందోళన చోటు చేసుకుంది. కానీ ఆఖరి నిమిషంలో మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ కుమార్తె ప్రియాంక చేరికతో కూటమి విజయం సొంతమైంది. 63 మంది కార్పొరేటర్లు, 11 మంది ఎక్స్ అఫీషియల్ సభ్యుల ఓటింగ్‌తో కూటమి విజయం సాధించింది. ఇక కూటమి నుంచి మేయర్ అభ్యర్థి రేసులో పిలా శ్రీనివాస్ ఉన్నారు.

GVMC Mayor – కూటమి నేతల సంబరాలు

వైసీపీ మేయర్‌ పై అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో జీవీఎంసీ కార్యాలయం వద్ద కూటమి నేతలు సంబరాల్లో మునిగితేలారు. బాణసంచా కాల్చి, మిఠాయిలు పంచి వేడుకలు చేసుకున్నారు.

నాలుగేళ్ల క్రితం జీవీఎంసీ ఎన్నికలు జరిగాయి. మొత్తం 98 వార్డులకు గాను వైసీపీ 58 వార్డులను గెలుచుకుంది. దీనితో 11వ వార్డు కార్పొరేటర్ గొలగాని హరివెంకటకుమారి మేయర్ పీఠంపై కూర్చున్నారు. ఇండిపెండెంట్‌ లుగా గెలిచిన నలుగురు, టీడీపీ(TDP) నుంచి గెలిచిన ఒక్కరు కూడా వైసీపీలో చేరారు. అయితే 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూటమి అధికారంలోకి రావడంతో వైసీపీ కార్పొరేటర్లలో చాలా మంది టీడీపీ, జనసేన గూటికి చేరిపోయారు. 19 మంది కార్పొరేటర్లు టీడీపీలో, 9 మంది జనసేనలోకి వెళ్లారు. అలాగే ఇండిపెండెంట్‌లు కూడా టీడీపీ, జనసేన పార్టీలోకి చేరిపోయారు. ఈ క్రమంలో మేయర్‌ పై అవిశ్వాస తీర్మానం ప్రకటిస్తూ 58 మంది కార్పొరేటర్ల సంతకాలు చేసి గత నెల 21న జీవీఎంసీ ఇన్‌చార్జ్, కలెక్టర్‌కు నోటీసులు ఇచ్చారు.

ఈ నేపథ్యంలో శనివారం అవిశ్వాస తీర్మానంపై కోసం ప్రత్యేకంగా కౌన్సిల్‌ను ఏర్పాటు చేశారు. అయితే అవిశ్వాసం నెగ్గాలంటే 74 మంది సభ్యుల మద్దతు అవసరం. ఆ దిశగా వైసీపీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. వైసీపీ నుంచి టీడీపీలో చేరిన కార్పొరేటర్లను తమ వైపుకు లాక్కునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేసింది. అంతే కాకుండా వారికి భారీగా నజరానాలు కూడా ప్రకటించినట్లు తెలుస్తోంది. మరోవైపు టీడీపీ కార్పొరేటర్లు అంతా కూడా మలేషియాలోనే ఉన్నారు. అవిశ్వాసం వీగిపోయేలా చేసేందుకు వైసీపీ ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఈరోజు జరిగిన జీవీఎంసీ ప్రత్యేక సమావేశానికి 74 మంది కూటమి సభ్యులు హాజరై ఓటింగ్‌ లో పాల్గొన్నారు. దీనితో మేయర్‌ పై పెట్టి అవిశ్వాస తీర్మానంపై కూటమి విజయం సాధించింది.

Also Read : Raj Kasireddy: విజయసాయి రెడ్డిపై సంచలన ఆడియో రిలీజ్ చేసిన రాజ్‌ కసిరెడ్డి

Leave A Reply

Your Email Id will not be published!