H. D. Deve Gowda: ఢిల్లీ మెట్రోలో ప్రయాణించిన మాజీ ప్రధాని !

ఢిల్లీ మెట్రోలో ప్రయాణించిన మాజీ ప్రధాని !

H. D. Deve Gowda: జనతాదళ్ (సెక్యులర్) పార్టీ అధినేత, మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆదివారం అక్కడి మెట్రోలో ప్రయాణించారు. మాజీ ప్రధాని తమతో ప్రయాణించడంతో ప్రయాణికులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దేవెగౌడ అధికారులతో ముచ్చటిస్తూ మెట్రో సేవల గురించి తెలుసుకున్నారు. కాగా ఢిల్లీలో ప్రధాని మోదీ ఏర్పాటు చేసిన ప్రధాన మంత్రుల మ్యూజియాన్ని దేవెగౌడ శనివారం సందర్శించారు. దానికి సంబంధించిన విషయాలను సోషల్‌ మీడియా ఎక్స్‌ వేదికగా పంచుకున్నారు.

H. D. Deve Gowda Travel

‘‘ఢిల్లీలోని ప్రధాన మంత్రుల మ్యూజియాన్ని సందర్శించాను. ఇది ఒక అపూర్వమైన అనుభవం. మన ప్రధానులు దేశ అభివృద్ధికి అందించిన సహకారాన్ని, వారి భిన్న నేపథ్యాలను తెలియజేస్తూ ఈ మ్యూజియం ఏర్పాటు చేయడం అభినందనీయం’’ అని ఆయన పేర్కొన్నారు. కర్ణాటకలోని మారుమూల గ్రామంలోని పేద రైతు కుటుంబానికి చెందిన తాను దేశ ప్రధాని కావడానికి, ఈ మ్యూజియంలో చోటుదక్కించుకోవడానికి ప్రజలే అండగా నిలిచారని తెలిపారు.

Also Read : Amit Shah: 2029లోనూ ఎన్డీఏదే అధికారం – అమిత్‌ షా

Leave A Reply

Your Email Id will not be published!