Harish Rao: బీఆర్ఎస్ ను వీడిన నేతలను వ్యక్తిగతంగా ఎప్పుడూ కలవలేదు – హరీశ్రావు
బీఆర్ఎస్ ను వీడిన నేతలను వ్యక్తిగతంగా ఎప్పుడూ కలవలేదు - హరీశ్రావు
Harish Rao : పీసీసీ అధ్యక్ష హోదాలో ఉంటూ మహేశ్కుమార్గౌడ్ చిల్లర వ్యాఖ్యలు చేస్తున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు(Harish Rao) విమర్శించారు. బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్తో బీఆర్ఎస్ నేతలు రహస్యంగా సమావేశమయ్యారంటూ మహేశ్కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. ఈమేరకు ‘ఎక్స్’ వేదికగా పోస్టు చేశారు. నేరుగా ఎదుర్కొనే ధైర్యం లేక దిగజారుడు రాజకీయాలు చేయడం సిగ్గుచేటన్నారు.
MLA Harish Rao Comments Viral
‘‘బట్ట కాల్చి మీద వేసినంత మాత్రాన అబద్ధాలు నిజం కావు. మా పార్టీ నుంచి వెళ్లిన నేతలను వ్యక్తిగతంగా ఎప్పుడూ కలవలేదు. పెళ్లిలోనో, చావులోనో కలిసిన సందర్భాలే తప్ప వ్యక్తిగతంగా కలవలేదు. మీరు విలువలు విస్మరించి రేవంత్రెడ్డి బాటలోనే నడుస్తున్నారు. ఇలాంటి ఆరోపణలు మానుకొని స్థాయికి తగ్గట్లు వ్యవహరించాలి. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలు, హామీల అమలుపై దృష్టిపెట్టాలి’’ అని హరీశ్రావు తెలిపారు.
సెల్ఫోన్ టార్చ్తో ట్రీట్మెంట్పై హరీష్రావు ఫైర్
జహీరాబాద్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో సెల్ ఫోన్ వెలుతురులో వైద్యం చేసిన ఘటనపై మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు. పాలన పడకేసిన రాష్ట్రంలో చివరకు ఇలాంటి దుస్థితి ఏర్పడిందని కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారాయన. ఒకవైపు కరెంట్ కోతలు, మరోవైపు ఆసుపత్రిలో ఉన్న జనరేటర్ పని చేయదు… చివరకు సెల్ ఫోన్ లైట్ వెలుతురులో చికిత్స చేయాల్సిన దుస్థితి ఏర్పడిందని మండిపడ్డారు. ఈ మేరకు శనివారం ఎక్స్లో ఆయన ఓ పోస్ట్ చేశారు.
రోజుకు 300కు పైగా పేషెంట్లు వచ్చే జహీరాబాద్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి పరిస్థితి ఇలా ఉంటే, గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ఇతర ఆసుపత్రుల పరిస్థితి ఎలా ఉన్నట్లు అని ప్రశ్నించారు. ఏడాదిన్నరగా పాలన పడకేసిందని, పేదలకు వైద్యం అందకుండా పోతున్నది అన్నారాయన. ‘‘సీఎం రేవంత్ రెడ్డి గారూ… గాలిలో మెడలు కట్టడం మానేసి, కనీస సౌకర్యాలు కల్పించండి’’ అని రేవంత్ను ట్యాగ్ చేస్తూ హరీశ్రావు పోస్ట్ చేశారు.
Also Read : PM Modi : భూపాల్ ‘మహిళా శక్తీకరణ’ మహా సమ్మేళనంలో మోదీ కీలక వ్యాఖ్యలు